ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జూలై 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. 27న ఆకుకూరలు, 28న కాయగూరలు, 29వ తేదీన కాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. శాకంబరీ ఉత్సవాలలో భాగంగా శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాల్లో దేవతా మూర్తులను ఆకుకూరలు, కాయగూరలతో విశేషంగా అలంకరిస్తారు. అమ్మవారిని అలంకరించేందుకు అవసరమైన పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను రైతులు, హోల్సేల్ వ్యాపారుల నుంచి సేకరించనున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 20 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను దాతల ద్వారా సేకరించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో
మూడు రోజుల పాటు ఉత్సవం


