క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి

Mar 27 2026 9:12 AM | Updated on Mar 27 2026 9:12 AM

క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి ● ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల వివరాలు, సర్వే నంబర్లు, సాగు చేస్తున్న పంటల వివరాలను త్వరితగతిన క్రోడీకరించాలన్నారు. ● పఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఇ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా రుణ సదుపాయం కల్పించి, యూనిట్లను క్షేత్రస్థాయిలో ప్రారంభించాలన్నారు. ● పల్నాడు జిల్లాకు ప్రత్యేక గుర్తింపునిచ్చేలా ఉత్పత్తులకు బ్రాండింగ్‌ కల్పించి, మార్కెటింగ్‌ సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు. ● డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి.ఝాన్సీరాణి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పండ్లు, కూరగాయలు, మాన్యుఫ్యాక్చరింగ్‌, పశు సంపద, ప్రసిద్ధ దుర్గి స్టోన్‌ క్రాఫ్ట్‌ వంటి వివిధ విభాగాల్లో క్లస్టర్లను గుర్తించినట్లు తెలిపారు. వీటన్నింటికీ త్వరలోనే మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. ● ఎస్‌బీఐ, ఏపీజీబీ, యూనియన్‌ బ్యాంకు రీజనల్‌ మేనేజర్లు పాల్గొని, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన డాక్యుమెంట్లు, బ్యాంకు నిబంధనలపై అధికారులకు అవగాహన కల్పించారు. డీపీఓ నాగేశ్వర్‌ నాయక్‌, ఉద్యానవన శాఖ పీడీ వెంకట్రావు, వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు, ప్రకృతి వ్యవసాయ అధికారి అమల కుమారి, ఎల్‌డీఎం రాంప్రసాద్‌, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఎంలు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

డీఆర్‌డీఏ సమీక్షలో జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ఔట్‌ రీచ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు రైతులకు గరిష్ట ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు

నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో వినూత్నంగా 28 క్లస్టర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా వివిధ రకాల ప్రాసెసింగ్‌ ప్లాంట్లను గ్రౌండింగ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో డీఆర్‌డీఎ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో రైతులు పండించే పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారానే వారికి మెరుగైన ఆదాయం లభిస్తుందన్నారు. ప్రతి మండలంలో గుర్తించిన క్లస్టర్లకు సంబంధించిన డీపీఆర్లు వెంటనే బ్యాంకులకు సమర్పించాలన్నారు.

పొదుపు మహిళల వ్యాపారాభివృద్ధికి ‘సంపన్నకారి’

నరసరావుపేట: స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమైన మహిళా వ్యాపారాభివృద్ధికి కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన ‘సంపన్న కారి’ కార్యక్రమం ఒక వరం లాంటిదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చాల వ్యాపారాలు ఒక స్థాయి తర్వాత మరింత అభివృద్ధి చెందడానికి సరైన మార్గదర్శకం, వ్యాపార ప్రణాళికలు, మార్కెట్‌ అంశాలపై అవగాహన లేకపోవడం, పెట్టుబడికి వనరులు లేకపొతే ఆ వ్యాపారాన్ని విస్తరించడం కష్టంగా మారుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రూపొందించిన కార్యక్రమమే ‘ సంపన్న కారి ‘ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికై న వారికి కనీసం 18 నెలలు ఇంక్యుబేషన్‌ సహాయం అందించడంతో పాటూ లక్ష వరకు గ్రాంట్‌ లేదా రూ.4లక్షల వరకు సున్నా వడ్డీ సదుపాయం, వ్యాపార పరంగా శిక్షణ, మార్కెట్‌ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో అర్హత కలిగిన సంఘ సభ్యులు ఏప్రిల్‌ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement