పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Sep 14 2025 3:29 AM | Updated on Sep 14 2025 3:29 AM

పల్నా

పల్నాడు

ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 పులిచింతల ప్రాజెక్టు సమాచారం బ్యారేజీ నుంచి నీటి విడుదల నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులా? మీడియా స్వేచ్ఛను హరించాలనుకోవడం దుర్మార్గం

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,10,540 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 2,50,853 క్యూసెక్కులు వదులుతున్నారు.

దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 3,007 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది.

ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లా పోరంకికి చెందిన కొమ్మినేని ప్రతాప్‌కుమార్‌ దంపతులు శనివారం రూ.లక్ష విరాళం సమర్పించారు.

కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం. సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తపై ఆ పత్రిక ఎడిటర్‌ను బాధ్యున్ని చేస్తూ కేసు నమోదు చేయడం దుర్మార్గం. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసే హక్కు ఏ ప్రభుత్వానికీ ఉండదు. కూటమి ప్రభుత్వం దాదాపు రూ.2 లక్షల కోట్ల రుణాలు చేసింది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూములను పందేరం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిపరులుగా మారారు. వారిపై ఎటువంటి కేసులు పెట్టకుండా వారి అవినీతి విషయాలను వెలుగులోకి తీసుకువస్తున్న పత్రికలపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారింది. సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

– వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, జనచైతన్య వేదిక

మీడియా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరించాలనుకోవటం దుర్మార్గం. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించే హక్కు మీడియాకు ఉంది. తప్పులను ఎత్తి చూపినప్పుడు వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అది వదిలి ప్రశ్నించిన గొంతుని నొక్కాలనుకోవటం దుర్మార్గమైన రాజకీయ చర్య. వీటన్నిటికి భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సమాజంలో ఫోర్త్‌ స్టేట్‌ అయినా మీడియా పట్ల తప్పుడు కేసులు నమోదు చేసి ఎడిటర్లను పోలీస్‌స్టేషన్లకు విచారణ పేరుతో తిప్పించటం కూటమి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం.

– కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గురజాల

7

పల్నాడు1
1/7

పల్నాడు

పల్నాడు2
2/7

పల్నాడు

పల్నాడు3
3/7

పల్నాడు

పల్నాడు4
4/7

పల్నాడు

పల్నాడు5
5/7

పల్నాడు

పల్నాడు6
6/7

పల్నాడు

పల్నాడు7
7/7

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement