
భక్తిశ్రద్ధలతో పూజలు
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జిగౌరి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మంగళవారం రోజున నువాఖాయి సందర్భంగా విశేష పూజలను నిర్వహించారు. ఆలయ పూజారి తరణి బెరుకో ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజలు సందర్భంగా గంట సమయం వరకు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి దర్శనాలు యథావిధిగా కొనసాగాయి. ప్రతీ ఏడాది నువాఖాయి సందర్భంగా అమ్మవారికి ఈ పూజలను నిర్వహిస్తామని పూజారి తెలిపారు. కొత్తగా పండించిన ధాన్యం పాయసం, అదేవిధంగా కొత్తగా పండిన కూరగాయలను అమ్మవారి చెంత ఉంచి పూజలను నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదంతో పంటలు సంమృద్ధిగా పండాలని, అదేవిధంగా అంతా సుభిక్షంగా ఉండాలని ఈ పూజలను నిర్వహిస్తారని ప్రతీతి.

భక్తిశ్రద్ధలతో పూజలు