
అవస్థలు డబుల్!
అండర్ పాసేజ్లు ఎవరి కోసం నిర్మించారో అర్ధం కావడం లేదు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన వీటి వల్ల కష్టాలు రెట్టింపయ్యాయి. వర్షం పడిన ప్రతిసారి రోజుల తరబడి చిక్కాలవలస వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయి. తప్పని పరిస్థితుల్లో వాహనాలను రైల్వే ట్రాక్ పైనుంచే తీసుకెళ్లాల్సి వస్తోంది. రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు.
– ఎం. లక్ష్మునాయుడు, చిక్కాలవలస
వర్షం పడిన ప్రతిసారీ ఇబ్బందులు పడుతున్నాం. వాహనాలు నడపలేకపోతున్నాం. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయినా రైల్వే శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలను ఇలా కష్టాలకు వదిలేయడం అన్యాయం. మంత్రి రామ్మోహన్నాయుడు స్పందించి రైల్వే అధికారులతో మాట్లాడి నీరు నిల్వ లేకుండా చూడాలి.
– కింతలి విశ్వనాథం, దాసరివానిపేట
కష్టాలు రెట్టింపయ్యాయంటున్న వాహనచోదకులు
రైల్వే అండర్ పాసేజ్లలో నిలిచిపోతున్న వర్షపు నీరు
రోజుల తరబడిన స్తంభించిపోతున్న వాహనాల రాకపోకలు
పట్టించుకోని రైల్వే అధికారులు

అవస్థలు డబుల్!

అవస్థలు డబుల్!

అవస్థలు డబుల్!