క్రీడలపై అవగాహన ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

క్రీడలపై అవగాహన ర్యాలీ

Aug 30 2025 10:41 AM | Updated on Aug 30 2025 10:47 AM

రాయగడ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక సద్భావన స్పొర్ట్స్‌ కాంప్లెక్స్‌ నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి జెండా ఊపి ప్రారంభించారు. క్రీడాకారులకు ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాల గురించి ఈ సందర్భంగా వివరించారు. క్రీడల్లొ రాణించాలని క్రీడాకారులనేద్దేశించి మాట్లాడారు. ర్యాలీలో క్రీడాకారులు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక జీసీడీ వాకర్స్‌ క్లబ్‌ సభ్యులతో సమావేశమైన కలెక్టర్‌ ఆరోగ్యానికి నడక ఎంతో అవసరమన్నారు. దీనిని ఈ క్లబ్‌ సభ్యులు వివిధ సందర్భాల్లో నడక గురించి చేపడుతున్న చైతన్య, అవగాహన కార్యక్రమాలను ప్రశంసించారు. క్లబ్‌ అధ్యక్షులు చిన్నారి విజయమోహన్‌, సభ్యులు కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement