భువనేశ్వర్‌ మహిళలకు అత్యంత సురక్షితం | - | Sakshi
Sakshi News home page

భువనేశ్వర్‌ మహిళలకు అత్యంత సురక్షితం

Aug 30 2025 10:39 AM | Updated on Aug 30 2025 10:48 AM

భువనేశ్వర్‌ మహిళలకు అత్యంత సురక్షితం

భువనేశ్వర్‌ మహిళలకు అత్యంత సురక్షితం

భువనేశ్వర్‌: భువనేశ్వర్‌ భారతదేశంలోని మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా ఎంపికై ంది. జాతీయ వార్షిక నివేదిక, మహిళా భద్రత సూచిక (ఎన్‌ఏఆర్‌ఐ – నారి) ఈ ఏడాది విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. జాతీయ మహిళా కమిషను ఈ నివేదికని ఆవిష్కరించింది. సురక్షితమైన నగరాల అగ్ర శ్రేణిలో భువనేశ్వర్‌తో పాటు కోహిమా (నాగాలాండ్‌), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌), ఐజ్వాల్‌ (మిజోరాం), గ్యాంగ్‌టాక్‌ (సిక్కిం), ఇటానగర్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌) ఉన్నాయి. 

విధాన సంస్కరణలు, అట్టడుగు స్థాయి చొరవల ద్వారా మహిళలకు సురక్షితమైన వాతావరణాలను సృష్టించడంలో ఈ నగరాలు స్థిరమైన మెరుగుదలలను ప్రదర్శించాయి. జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ కిశోర్‌ రహత్కర్‌ విడుదల చేసిన నివేదిక ఈ విషయం పేర్కొంది. మరోవైపు ఈ దిశలో రాంచీ, శ్రీనగర్‌, కోల్‌కతా, ఢిల్లీ, ఫరీదాబాద్‌, పాట్నా అత్యల్ప స్కోరు సాధించాయి. 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై నిర్వహించిన సర్వే ఆధారంగా దేశవ్యాప్త సూచికని విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement