
యువకుడి దారుణ హత్య
రాయగడ: పాత కక్షలతో ఒక యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడు స్థానిక మహిళా కళాశాల వైనుక ఉన్న హరిజన వీధికి చెందిన రోహిత్ థప్ప(25)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక అగ్నిమాపక కేంద్రం సమీపంలోని మైదానంలో ఉన్న రోహిత్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న రోహిత్ను వదిలి పారిపోయారు. తీవ్రగాయాలకు గురై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతడిని అటువైపుగా వెళ్తున్న కొంతమంది చూసి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తలకు బలమైన గాయమవ్వడంతో అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాత కక్షల కారణంగానే దుండగులు రోహిత్ను హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు.

యువకుడి దారుణ హత్య