స్వాతంత్య్ర వేడుకలకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర వేడుకలకు సన్నాహాలు

Aug 6 2025 6:22 AM | Updated on Aug 6 2025 6:22 AM

స్వాతంత్య్ర వేడుకలకు సన్నాహాలు

స్వాతంత్య్ర వేడుకలకు సన్నాహాలు

డ్‌ వరకు దారి పొడవునా ప్రత్యేక అలంకరణతో సౌందర్య ఆకర్షణను పెంచాలని శర్మ సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన సంస్థలు విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. రాష్ట్రం అంతటా జిల్లా మరియు సబ్‌–డివిజన్‌ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో ఉత్తమ బృందాలు, ప్రదర్శన వర్గాలకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా సమాచారం, ప్రజా సంబంధాలు విభాగం ప్రచురించిన ఉత్కళ్‌ ప్రసంగ్‌, ఒడిశా రివ్యూ (ఆంగ్లం) ప్రత్యేక సంచికలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఆహ్వాన పత్రికల ముద్రణ, పంపిణీని వ్యవహారం రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాలు విభాగం పర్యవేక్షిస్తుంది.

ఈ సమావేశంలో డివిజనల్‌ డైరెక్టర్‌ అనుజ్‌ కుమార్‌ దాస్‌ పట్నాయక్‌, అదనపు కార్యదర్శి బిష్ణుప్రియ సాహు, డిప్యూటీ డైరెక్టర్‌ (రీజియన్‌) సుచేతా ప్రియదర్శిని, ఆర్థిక సలహాదారు పృథ్వి రాజ్‌ పాణి తదితర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

భువనేశ్వర్‌: రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్‌ శర్మ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఆగస్టు 15న జరగనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఏర్పాట్లు ఖరారు చేశారు. ఈ సంవత్సరం, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ రాష్ట్ర స్థాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. స్థానిక మహాత్మా గాంధీ మార్గ్‌లో జరిగే కవాతులో ఆయన జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు. ఈ నెల 11 నుంచి 13 వరకు పరేడ్‌ ప్రదర్శన సాధన చేస్తారు. ఆగస్టు 15న జరిగే ప్రధాన కార్యక్రమంలో ఉదయం బిగుల్‌ కాల్‌, ఉత్సవ రామ్‌ధున్‌, టీవీ మరియు సోషల్‌ మీడియా చానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసార కవరేజ్‌ ఉంటాయి. రాజ్‌ భవన్‌ నుంచి పరేడ్‌ గ్రౌం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement