
యోగాతో మానసిక వికాసం
జయపురం: యోగాతో మానసిక వికాసం సాధ్యమని వక్తలు అన్నారు. జయపురం అరవిందనగర్ని సరస్వతీ శిశు విద్యామందిర ప్రాంగణంలో యోగా మహోత్సవ సమితి ఒడిశా ప్రాంతీయ యోగ శిక్షణ శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. శిబిరంలో ఒడిశా పశ్చిమ ప్రాంతంతో జిల్లాలు, కొరాపుట్ జిల్లాతోపాటు ఆరు జిల్లాల యోగా కోఆర్డినేటతో పాటు 50 మందికి పైగా యోగా శిక్షకులు హాజరయ్యారు. వారు ఉత్తమ యోగా శిక్షణ పొందారు. శిక్షకులకు శిక్షణ ఇచ్చిన వారు భారతీయ యోగా ప్రదర్శనలో అమూల్య ప్రతిభ ఉన్న వారు అని యోగా మహోత్సవ సమితి ప్రాంతీయ అధికారి, సాధారణ కార్యదర్శి డాక్టర్ దేవకాంత బెహర వెల్లడించారు. యోగాతో శారీరక, మానసిక వికాసంతో పాటు ఆధ్యాత్మక భావాలు కలుగుతాయన్నారు. యోగాపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. యోగా శిక్షకులు సరోజ్ కాంత మహాపాత్రో, ప్రాంతీయ కోఆర్డినేటర్ అమియ దాస్, కొరాపుట్ జిల్లా యోగా మహోత్వవ సమితి కోఆర్డినేటర్ సురేష్ నంద పాల్గొన్నారు. యోగా శిక్షణ శిబిరంలో మనోరంజన్ ప్రధాన్, జానకీ పాణిగ్రహి ప్రసంగించారు.

యోగాతో మానసిక వికాసం

యోగాతో మానసిక వికాసం