కుంతర్‌కల్‌లో న్యాయ చైతన్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

కుంతర్‌కల్‌లో న్యాయ చైతన్య శిబిరం

May 31 2025 1:00 AM | Updated on May 31 2025 1:22 AM

జయపురం: జయపురం సమితి బలియ గ్రామ పంచాయతీ కుంతర్‌కల్‌ గ్రామంలో శుక్రవారం న్యాయ చైతన్య శిబిరాన్ని నిర్వహించారు. స్థాయి నిరంతర్‌ లోక్‌ అదాలత్‌ కార్యకలాపాలపై జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు నిర్వహించిన శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి, లోక్‌ అదాలత్‌ శాశ్వత విచారపతి ప్రద్యోమయి సుజాత వివరించారు. స్పెషల్‌ కోర్టు స్పెషల్‌ పోస్కో కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డాక్టర్‌ వి.గాయిత్రీ దేవి, డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కె.దివాకరరావు, డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ అండ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ గీతాంజలీదోల్‌ పాల్గొన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కలిగే లాభాలు, ఉచితంగా లభించే న్యాయ సేవలపై చైతన్యం కలిగించారు. నీరు, విద్యుత్‌, వంటగ్యాస్‌, టెలిఫోన్‌ సేవలపై వివరించారు. దేవేంద్ర కొహూర్‌, పారా లీగల్‌ స్వచ్ఛంద సేవక్‌ దీప్తి నాయక్‌ శిబిరాన్ని పర్యవేక్షించారు.

చేతి వృత్తులను ప్రోత్సహించాలి

రాయగడ: చేతి వృత్తి పనులను నమ్ముకుని జీవనోపాధిని పొందుతున్న వారిని ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సరస్వతీ మాఝి అన్నారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో వృత్తులవారికి అవగాహన శిబిరాన్ని జిల్లా పారిశ్రామిక కేంద్రం శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేతి వృత్తులు చేసేవారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్‌ మేనేజర్‌ బిజయ్‌ కుమార్‌ సాహు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తి పనులవారి కోసం ప్రత్యేకంగా అమలు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై అందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ డిప్యూటీ డైరెక్టర్‌ కోటి రత్నం, జిల్లా సాంస్కృతిక విభాగం అధికారి సుచిత్ర బౌరి తదితరులు పాల్గొన్నారు.

సిమెంట్‌ ట్రక్కులో

దోపిడీ దొంగల అరెస్టు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసుస్టేషన్‌ పరిధిలో గల చితపరి వంతెన వద్ద ఈ నెలా 23న ఓ సిమెంట్‌ లోడ్‌ను దోపి డీ దొంగలు దోచుకున్నారు. దీనిపై ఐఐసీ ధీరజ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులు చితపరి గ్రామ వాసులని తెలుసుకుని గ్రామానికి వెళ్లి వారిని అరెస్టు చేశారు. బబ్లు అనే వ్యక్తి కోసం మాత్రం గాలిస్తున్నారు. అరెస్టయిన ముగ్గురిలో ఒకరు బాలుడు.

పాముకాటుతో

నాలుగేళ్ల బాలిక మృతి

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీసుస్టేషన్‌ పరిధిలో గల శిమిలిబాంఛా పంచాయతీ బపాన్‌పల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సంధ్య(4) అనేచిన్నారిని పాము కాటు వేసింది. బాలిక కేకలు వేయడంతో తల్లి లేచి చూసేసరికి పాము కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు పామును చంపి బాలికను కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కానీ దారిలోనే పాప చనిపోయింది. విషయం తెలుసుకున్న ఎంవీ 79 పోలీసులు ఆరోగ్య కేంద్రానికి చేరుకుని బాలిక మృతిపై కేసు నమోదు చేశారు.

కుంతర్‌కల్‌లో   న్యాయ చైతన్య శిబిరం 1
1/3

కుంతర్‌కల్‌లో న్యాయ చైతన్య శిబిరం

కుంతర్‌కల్‌లో   న్యాయ చైతన్య శిబిరం 2
2/3

కుంతర్‌కల్‌లో న్యాయ చైతన్య శిబిరం

కుంతర్‌కల్‌లో   న్యాయ చైతన్య శిబిరం 3
3/3

కుంతర్‌కల్‌లో న్యాయ చైతన్య శిబిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement