అవగాహనే ఆయుధం : సీఎం | - | Sakshi
Sakshi News home page

అవగాహనే ఆయుధం : సీఎం

Jun 1 2025 12:46 AM | Updated on Jun 1 2025 12:46 AM

అవగాహ

అవగాహనే ఆయుధం : సీఎం

భువనేశ్వర్‌: పొగాకు సంబంధిత వైపరీత్యాల నివారణకు అవగాహన ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శని వారం నిర్వహించిన అవగాహన ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. పొగాకు వ్యతిరేకత కార్యకలాపాల సాఫల్యత అంతర్‌ విభాగ సమన్వయంతో సాధ్యమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.అశ్వస్థి తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (ఎన్‌టీసీపీ ) కింద ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్థానిక గీత గోవింద సదనన్‌లో రాష్ట్ర స్థాయి ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం 2025ను కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పొగాకు రహిత ఒడిశాకు తమ మద్దతును తెలుపుతూ పౌరులు పాల్గొనేలా సంతకం ప్రచారాన్ని ప్రారంభించారు. పొగాకు వాడకంతో సంబంధం ఉన్న నష్టాలపై ప్రజలకు, ముఖ్యంగా యువత, దుర్బల వర్గాలకు అవగాహన కల్పించడానికి శాఖ రూపొందించిన సమాచార విద్య సంచిక (ఐఈసీ), 2024–25 వార్షిక కార్యాచరణ నివేదికను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలలు జాతీయ పొగాకు రహిత మార్గదర్శకాలపై స్వీయ అవగాహన కోసం పొగాకు రహిత విద్యా సంస్థలు వెబ్‌ డిజిటల్‌ అప్లికేషన్‌ ప్రారంభించారు. పొగాకు నియంత్రణ చొరవలను ఆదర్శప్రాయంగా అమలు చేసిన 3 జిల్లాలను అభినందించారు. ఎన్‌టీసీపీ సమగ్రంగా అమలు చేసినందుకు గంజాం, పొగాకు నియంత్రణ చట్టాన్ని అమలు చేసినందుకు సుందర్‌గఢ్‌, ఈ కార్యక్రమం కింద సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ కోసం కటక్‌ జిల్లాలు ప్రత్యేక బహుమతులు అందుకున్నాయి. పొగాకు వ్యతిరేక కార్యకలాపాల్లో అనుబంధ మద్దతుకు గుర్తింపుగా పాఠశాల, సామూహిక విద్య, ఉన్నత విద్య, అబ్కారి, పంచాయతీ రాజ్‌, తాగు నీరు, హోం శాఖ 5 విభాగాలకు అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్‌ జె. ఎం. బబోర్త, డైరెక్టర్‌ డాక్టర్‌ నీలకంఠ మిశ్రా, ఎన్‌టీసీపీ అదనపు డైరెక్టర్‌ మరియు రాష్ట్ర నోడల్‌ అధికారి డాక్టర్‌ సుశాంత కుమార్‌ స్వంయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అవగాహనే ఆయుధం : సీఎం 1
1/1

అవగాహనే ఆయుధం : సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement