కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు క్యూ | - | Sakshi
Sakshi News home page

కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు క్యూ

Jun 4 2025 1:27 AM | Updated on Jun 4 2025 1:27 AM

కేంద్

కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు క్యూ

జయపురం: ఈ విద్యా సంవత్సరం నుంచి జయపురం కేంద్రీయ విద్యాలయంలో తరగతులు ప్రారంభమవ్వనున్నాయి. దీంతో తమ పిల్లలను విద్యాలయంలో చేర్పించేందుకు తల్లిదండ్రులు దరఖాస్తుల కోసం క్యూ కడుతున్నారు. సోమవారం నుంచి దరఖాస్తులు పంపిణీ ప్రారంభించారు. క్యూ ఆర్‌ కోడ్‌ స్కానర్‌ ద్వారా దరఖాస్తు పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 241 దరఖాస్తులను ప్రజలు ఉచితంగా తీసుకున్నారు. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు అందజేయనున్నారు. అనంతరం ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రథమ సంవత్సరం 1 నుంచి 5వ తరగతులు ప్రారంభించనున్నారు. ఒక్కొక్క తరగతిలో 40 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు.

ఎట్టకేలకు నిందితుడు అరెస్టు

జయపురం: ఒక మైనర్‌ బాలికపై లైంగిక దాడి జరిపి గర్భవతిని చేసి పరారైన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. బొరిగుమ్మ సమితి బీజేపీ నేత కుమారుడైన నిందితుడు రాజేంద్ర బొత్రను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. రాజేంద్ర ఒక మైనర్‌ బాలికను గర్భవతిని చేసిన ఘటనను మాఫీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వదంతులు ఉన్నాయి. ఈ విషయం బయట చెబితే చంపుతానని బాధిక కుటుంబాన్ని బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో రాజకీయ ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

వైభవంగా అమ్మవారి

పండగలు

పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి మండళదేవి గ్రామంలో అమ్మవారి పండగలు ఐదు రోజులుగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారి పండగల చివరి రోజు కావడంతో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి హాజరయ్యారు. సుదీర్ఘ పదేళ్ల తర్వాత మండలదేవి గ్రామంలో అమ్మవారి పండుగలు జరుపుకోవడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి బంధువర్గం విచ్చేసి అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు.

శబరి నదిలో మునిగి

యువకుడు మృతి

మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి పోటేర్‌ పంచాయతీ కన్యాశ్రమం సమీపంలోని శబరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు నదిలో మునిగి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పోటేర్‌కు చెందిన అరుణ్‌ గౌడ్‌ అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం స్నానానికి వెళ్లాడు. అయితే అటునుంచి ఆయన ఇంటికి రాలేదు. ఎక్కడికో స్నేహితులతో వెళ్లుంటాడు అని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కాగా మంగళవారం ఉదయం పోడియా సమితి ఉండరుకండ పంచాయతీ ఎంపీవీ 57 గ్రామం వద్ద శబరి నది ఒడ్డున మృతదేహం తేలుతూ కనిపించింది. వెంటనే స్థానికులు కలిమెల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కలిమెల ఐఐసీ ముకుందో మేల్కా సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు.

కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు క్యూ 1
1/2

కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు క్యూ

కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు క్యూ 2
2/2

కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు క్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement