
మైనర్పై లైంగిక దాడి చేసిన వ్యక్తి పరార్
జయపురం.: పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పరచి మైనర్ బాలికను గర్భవతిని చేసిన కొట్పాడ్ ఎమ్మెల్యే బొరిగుమ్మ సమితి ప్రతినిధి, బీజేపీ నేత కుమారుడుపై చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. నిందితుడు రాజేంద్రభొత్ర ఫరారీలో ఉండటంతో అతడు వినియోగిస్తున్న రెండు కార్లు, ఒక బైక్ను సీజ్ చేశారు. నిందితుడి కుటుంబ సభ్యులను విచారించామన్నారు. అయితే అతడి జాడ తెలియరాలేదని సయపురం సదర్ పోలీసు స్టేషన్ అధికారి సచీంధ ప్రధాన్ శనివారం వెల్లడించారు. నిందితుడు బొరిగుమ్మ సమితి సనపొరియ పంచాయతీ సవునిగిడ గ్రామం రాజేంద్ర భొత్ర కు ఒక వివాహం సమయంలో మైనర్ బాలికను చూశారు. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం ఏర్పడింది. రాజేంద్ర ఆమెను వివిధ విధాలుగా ప్రలోభ పరచి శారీరకంగా అనుభవించాడు. ఇటీవల బాలిక తనకు కడుపు నొప్పిగా ఉందని తల్లితో చెప్పగా.. ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఐదు నెలల గర్భిణిగా తేల్చారు. బాలిక జరిగిన విషయం తల్లికి తెలపగా ఆమె తల్లి గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. గ్రామ పెద్దలు నిందితుడు రాజేంద్రను గ్రామానికి రమ్మని కబురు చేశారు. అయితే రాజకీయ కుటుంబం కావటంతో రాకుండా ఎంతైనా ఇస్తాను కడుపు తీయించుకొమ్మని కబురు చేశారు. మరో మార్గం లేక బాధితురాలి తల్లి జయపురం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోస్కో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాజకీయ రంగుగా మారింది. బీజేడీ పార్టీ నేత.. మాజీ మంత్రి పద్మిణీ దియాన్ మహిళా కార్యకర్తలతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే నిందితుని అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీని కలిసి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లగా అతను లేకపోవడంతో అతడు వినియోగించే రెండు కార్లు, ఒక బైక్ను సీజ్ చేశారు.

మైనర్పై లైంగిక దాడి చేసిన వ్యక్తి పరార్

మైనర్పై లైంగిక దాడి చేసిన వ్యక్తి పరార్