
మంచం మీద గర్భిణి తరలింపు
కొరాపుట్: గ్రామానికి అంబులెన్స్ రాలేకపోవడంతో ఓ గర్భిణిని గిరిజనులు మంచం మీద తీసుకెళ్లినా శిశువును రక్షించుకోలేకపోయారు. నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి ఇచ్ఛాపూర్ పంచాయతీ డుముని గుడ గ్రామంలో చక్రధర్ జానీ భార్య బిమల జానీకి పురిటినొప్పులు వచ్చాయి. గ్రామస్తులు ప్రభుత్వ అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా మార్గం లేక రెండు కిలోమీటర్ల ముందు ఆగిపోయింది. దీంతో మంచం మీద గర్భిణిని అంబులెన్స్ వద్దకు చేర్చారు.
దారిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలను జొరిగాం ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చగా వైద్యులు పరిశీలించి శిశువు మృతి చెందినట్లు ప్రకటించారు.

మంచం మీద గర్భిణి తరలింపు

మంచం మీద గర్భిణి తరలింపు