ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

Published Sun, Feb 9 2025 12:38 AM | Last Updated on Sun, Feb 9 2025 12:38 AM

ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

మల్కనగిరి: ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చున్నీలతో చెట్టుకొమ్మకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. జిల్లాలోని కలిమెల సమితి పరిధి ఎంపీవీ–41 గ్రామ సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న వీరి మృతదేహాలను ఎం.వి.79 పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పొస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన విద్యార్థినులు ఎం.వి–72 నోడల్‌ ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న మందిరా షొడి, జ్యోతి హిల్దార్‌లుగా గుర్తించారు. విద్యార్థినుల మృతదేహాలు ఎం.పి.వి.41 గ్రామం సమీపంలోని ఒక చెట్టుకు తమ చున్నీలతో ఉరివేసుకుని వేలాడుతూ ఉండటాన్ని అటువైపుగా వెళుతున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టు కొమ్మకు చున్నీలతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న వైనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement