అధ్వానంగా గుడారి రోడ్డు | - | Sakshi
Sakshi News home page

అధ్వానంగా గుడారి రోడ్డు

May 26 2025 12:27 AM | Updated on May 26 2025 12:27 AM

అధ్వానంగా గుడారి రోడ్డు

అధ్వానంగా గుడారి రోడ్డు

రాయగడ: జిల్లాలోని గుడారి ఎన్‌ఏసీ పరిధిలోని రోడ్లు అత్యంత దయనీయంగా మారాయి. ఎన్‌ఏసీకి వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డు పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. కొద్దిపాటి వర్షం కురుస్తే గుంతల్లో నీరు చేరి వాహన రాకపొకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం ఈ రహదారి గుండా సంబంధిత శాఖ అధికారులు వెళుతున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని గుడారి వాసులు ఆరోపిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఎన్‌ఏసీ కార్యనిర్వాహక అధికారి ప్రసన్నకుమార్‌ పాఢి ఇక్కడ పడ్డ గుంతలను కప్పేందుకు మొరుము, కంకర వేశారు. అయితే ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారి పూర్తిగా గుంతల మయమయ్యింది. ఇటువంటి తరహా రోడ్లు ఎన్‌ఏసీ పరిధిలో ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement