22 నుంచి ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

22 నుంచి ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నీ

Nov 6 2025 8:32 AM | Updated on Nov 6 2025 8:32 AM

22 నుంచి ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నీ

22 నుంచి ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నీ

22 నుంచి ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నీ

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని మేరీస్‌ స్టెల్లా ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 22నుంచి 24వ తేదీ వరకు ఈకార్న్‌ ఇంటర్నేషనల్‌ ఫిడో రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌–2025ను నిర్వహిస్తున్నామని ఆంధ్రా చెస్‌ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఫణి కుమార్‌ చెప్పారు. టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేరీస్‌ స్టెల్లా కళాశాల ఆవరణలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఫణి కుమార్‌ మాట్లాడుతూ ఆల్‌ ఇండి యా చెస్‌ ఫెడరేషన్‌, ఆంధ్రా చెస్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని, ఈ టోర్నమెంట్‌లో మన రాష్ట్రం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి చెస్‌ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో విజేతలకు రూ.8లక్షల విలువైన బహుమతులను అందజేయనున్నామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్‌ జి.ఇన్యాసమ్మ, కళాశాల కోచ్‌ వి.రాజ్‌ కుమార్‌, ఎన్టీఆర్‌ జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అక్బర్‌ బాషా, ఈకార్న్‌ సంస్థ ప్రతినిధి ఎం.సిగ్థ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement