
పోలీస్ గ్రీవెన్స్లో 72 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 72 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి ఆమె సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని సంబంధిత ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్లో ఆస్తి తగాదాలు, భూవివాదాలకు సంబంధించి 41, కుటుంబ కలహాలపై 4, కొట్లాటలపై 1, వివిధ మోసాలపై 3, మహిళల సంబంధిత నేరాలపై 6, దొంగతనాలపై 2, చిన్న వివాదాలపై 15 ఇలా మొత్తం 72 ఫిర్యాదులు అందాయి.