పల్లికొండలో చోరీ | - | Sakshi
Sakshi News home page

పల్లికొండలో చోరీ

Nov 19 2025 6:19 AM | Updated on Nov 19 2025 6:19 AM

పల్లికొండలో చోరీ

పల్లికొండలో చోరీ

పల్లికొండలో చోరీ

ఆరు తులాల బంగారం, నగదు అపహరణ

కమ్మర్‌పల్లి: భీమ్‌గల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పల్లికొండ గ్రామానికి చెందిన సదానందం అనే వ్యక్తి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి చోరి జరిగింది. ఎస్సై సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉద యం సదానందం తన కుటుంబ సభ్యులతో కలిసి జ గిత్యాలకు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గ మనించిన దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన సదానందం చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో ఉన్న సుమారు ఆరు తులా ల బంగారం, రూ. 40వేల నగదు గల దుబాయి కరె న్సీని దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు తె లిపాడు. క్లూస్‌ టీంను రప్పించి దుండగుల వేలి ము ద్రలను సేకరించినట్లు ఎస్సై తెలిపారు. బాధితుడి ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement