ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Oct 14 2025 6:51 AM | Updated on Oct 14 2025 6:51 AM

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

అదనపు కలెక్టర్‌ అంకిత్‌

ప్రజావాణిలో 88 వినతుల స్వీకరణ

నిజామాబాద్‌అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అంకిత్‌ అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమ వారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జి ల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌తో పాటు డీఆర్డీవో సాయాగౌడ్‌, ట్రైనీ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావీ, బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మొత్తంగా 88 ఫిర్యాదులు అందాయి. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement