
చుట్టం చూపుగా వచ్చి చోరీలు
● రాజస్థాన్కు చెందిన నిందితుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: చుట్టం చూపుగా వచ్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్కు చెందిన ఓ నిందితుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 25 న జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన మాసిరెడ్డి శివారెడ్డి కుటుంబం ఇంటికి తాళం వేసి దైవదర్శనం కోసం వేములవాడకు వెళ్లింది. మరుసటి రోజు వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని 19 తులాల బంగారు ఆభరణాలు అపహరణ కు గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసు కుని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేశా రు. శనివారం హౌసింగ్బోర్డు కాలనీలో ఓ కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని వాకబు చేశారు. తెలంగాణ నంబర్ ప్లేట్ కారులో తిరుగుతూ హిందీలో మాత్రమే మా ట్లాడడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకు ని విచారించగా నేరం అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. నిందితుడిని రాజస్థాన్ రాష్ట్రంలోని కరోలీ జి ల్లా అజీజ్పూర్ గ్రామానికి చెందిన హన్సరాజ్ మీ నాగా గుర్తించారు. అతడు కొద్ది రోజుల క్రితం మెద క్ రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉండే తన బంధువు ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడని పేర్కొన్నారు. స్నేహితుడైన అభిషేక్తో కలిసి కామారెడ్డిలో తాళం వేసిన ఇంట్లో చోరీ చేశాడన్నారు. నిందితుడి వద్ద నుంచి 2 తులాల బంగారు ఆభరణాలు, కారు, సె ల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.