
కొత్త చట్టాలపై అవగాహన ఉండాలి
ఖలీల్వాడి: కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అన్నారు. బుధవారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్ లో నూతన నేర న్యాయ చట్టాలపై మీడియా ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 1జూలై2024 నుంచి కొత్తగా ప్రవేశపెట్టిందని, పాత చట్టాలాను సవరించి మూడు కొత్త చట్టాలను రూపొందిచారని, కొత్త చట్టాల ద్వారా వెంటనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న పాత చట్టాలు ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలు రద్దయ్యాయని వీటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం చట్టాలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జర్నలిస్టులతో అవగాహన కల్పించి చట్టాల గురించి ప్రజలకు తెలియజేయాలని వివరించారు. క్రైమ్ వార్తల విషయంలో తప్పనిసరిగా పలు సూచనలు, జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో టెక్నాలజీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలే కానీ దానిని దుర్వినియోగం చేయకూడదని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, ఏసీపీలు ఎల్ రాజా వెంకట్రెడ్డి, జె వెంకటేశ్వర్రెడ్డి. పి. శ్రీనివాస్, మస్తాన్ అలీ, రూరల్ ఎస్సై ఎండీ ఆరీఫ్వుద్దీన్ తదితరులు ఉన్నారు.
సీపీ పోతరాజు సాయిచైతన్య