
ధూమపానం మానసిక, శారీరక బానిసత్వం
నిజామాబాద్నాగారం: ధూమపానం అనేది అలవాటు కాదని, అది ఆరోగ్యాన్ని నాశనం చేసే మానసిక, శారీరక బానిసత్వమని డీప్యూటీ డీఎంహెచ్వోలు తుకారాం రాథోడ్, అంజనా అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలోని మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక అవగాహన ర్యాలీని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీప్యూటీ డీఎంహెచ్వోలు మాట్లాడుతూ.. సిగరెట్, గుట్కా, బీడీ వంటివాటిలో నికోటిన్, టార్ వంటి విషపదార్థాలు ఉంటాయని, అవి ఊపిరితిత్తుల క్యాన్సర్, హార్ట్ఎటాక్, స్ట్రోక్, నోటి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయన్నారు. పాసివ్ స్మోకింగ్కు ధూమపానం అలవాటు లేని వారు సైతం బలవుతుంటారన్నారు. ‘నేను ధూమపానం మానుతాను – ఆరోగ్యంగా జీవిస్తాను’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో పవైద్యులు సామ్రాట్యాదవ్, వెంకటేశ్, సహిస్తా ఫిర్దోస్, అజ్మతున్నేసా బేగం, భార్గవి, అవంతి, మెడికోలు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.