
డిచ్పల్లిలో యోగా వాక్
డిచ్పల్లి: అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్ద వేడుకల్లో భాగంగా డిచ్పల్లి ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో యోగా వాక్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఒక భూమి – ఒక ఆరోగ్యం కోసం యోగా’ అనే నినాదంతో 11వ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయుర్వేద ప్రథమ చిక్సిత ఆలయం యోగా ఇన్స్పెక్టర్లు ఓంసాయి, స్వప్న, బెటాలియన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.