డ్రోన్‌ పెట్రోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ పెట్రోలింగ్‌

Jun 5 2025 8:14 AM | Updated on Jun 5 2025 8:14 AM

డ్రోన

డ్రోన్‌ పెట్రోలింగ్‌

ఖలీల్‌వాడి: ప్రజలకు భద్రతను పెంచేందుకు పోలీ సు శాఖ ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగి స్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు, గొడవలు, గుంపులుగా గుమిగూడిన చోట్ల ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పోతరాజు సాయిచైతన్య నిజామాబాద్‌ నగరంలో డ్రోన్‌ మొబైల్‌ పెట్రోలింగ్‌కు శ్రీకారం చుట్టారు. పర్యవేక్షణ మెరుగుపరచడం, నేరాలను అడ్డుకోవడం, త్వరితగతిన స్పందించి నిర్ధారించిన ప్రాంతాలకు పోలీసులు సులువుగా వెళ్లే అవకాశం ఉంటుంది.

ప్రయోజనాలు..

డ్రోన్‌ల ద్వారా పండగలు, ర్యాలీలు, పార్టీల మీటింగ్‌లు, జనం గుంపులను పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్‌ నియంత్రణ, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, మిస్సింగ్‌ అయిన వ్యక్తులు, అనుమానితుల గుర్తింపు, విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్లను వినియోగిస్తారు. గతంలోనూ డ్రోన్‌ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ చేసిన సందర్భాలు ఉన్నాయి.

నేరాలకు చెక్‌ పడే విధంగా...

నగరంలో అర్ధరాత్రి వేళ రోడ్లపై తిరిగే వారు, గ్యాంగ్‌లు, అనుమానితులు డ్రోన్‌ కెమెరాలకు చిక్కడంతో వారి ఆగడాలకు చెక్‌ పడుతుంది. అర్ధరాత్రి వర కు గుంపులు, గుంపులుగా సమావేశమై న్యూసెన్స్‌ చేసే వారిని ఈజీగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. చోరీల నివారణ, దర్యాప్తులో ఉపయోగపడుతుంది. బైక్‌, ఆటో, కార్ల దొంగతనాలకు చెక్‌పడుతుంది. సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదేశాలతో డ్రోన్‌ల పర్యవేక్షణ నగరంలో త్వరలో అందుబాటులోకి రానుంది.

డ్రోన్‌ ఎలా పని చేస్తుంది

నగరంలో లా అండ్‌ అర్డర్‌ తోపాటు ట్రాఫిక్‌ లో డ్రోన్‌లను అందుబాటులోకి తీసుకురా నున్నారు. ఒక్కో డ్రోన్‌ ధర సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్‌ కింద, హై–డెఫినిషన్‌ కెమెరాలు, నైట్‌–విజన్‌ వీడియో కూ డా ఉంటుంది. డ్రోన్ల నుంచి వచ్చే ప్రత్యక్ష వీడియో ఫుటేజీ మొబైల్‌ పెట్రోలింగ్‌ యూ నిట్లతోపాటు కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానించబడుతుంది. సున్నిత ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాలను డ్రోన్‌తో పర్యవేక్షిస్తారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేసే అవకాశం ఉంటుంది.

శాంతిభద్రతల పరిరక్షణకు..

డ్రోన్లను సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగిస్తాం. దీనితో తగదాలు, గుంపులు, గుంపులుగా ఉండేవారు, అర్ధరాత్రి తిరిగే ఆకతాయిలను డ్రోన్‌ సహాయంతో నివారించగలుగతాం. అనుమానితుల, దొంగల గుర్తింపునకు డ్రోన్లు ఉపయోగపడాతాయి. గతంలో పండగలు, ర్యాలీలు, వివిధ వాటికి డ్రోన్‌లను ఉపయోగించాం. ఇప్పుడు నగరంలో శాంతిభద్రతలకు ఉపయోగిస్తాం. – రాజావెంకట్‌రెడ్డి, ఏసీపీ, నిజామాబాద్‌

నగరంలో త్వరలో ప్రారంభించనున్న పోలీసు శాఖ

ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌కు ఒక్కోటి..

డ్రోన్‌ కెమెరాలు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం

ముందుగా సమస్యాత్మక

పోలీస్‌స్టేషన్ల పరిధిలో అమలు

డ్రోన్‌ పెట్రోలింగ్‌1
1/1

డ్రోన్‌ పెట్రోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement