దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి

Jun 5 2025 8:14 AM | Updated on Jun 5 2025 8:14 AM

దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి

దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి

జక్రాన్‌పల్లి/బాల్కొండ: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయా లని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జక్రాన్‌పల్లి మండలం మాదాపూర్‌, బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌, ముప్కా ల్‌ మండలం నల్లూర్‌ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే రెవె న్యూ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, హెల్ప్‌డెస్క్‌, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్‌ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు.

ఒకే దరఖాస్తులో రెండు, మూడు భూ సమస్యలను పేర్కొనవచ్చని తెలిపారు. సమయపాలన పాటిస్తూ అర్జీలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇది వరకే మెండోరా మండలంలో భూ భారతి చట్టంపై పైలట్‌ మండలంగా ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేశామన్నారు. మిగ తా 32 మండలాల్లో ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ ఆర్డీవో రాజాగౌడ్‌, తహసీల్దార్లు కిరణ్మయి, శ్రీధర్‌, ముంతాజ్బొద్దీన్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

జక్రాన్‌పల్లి, బాల్కొండ, ముప్కాల్‌

మండలాల్లో పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement