డీసీసీబీ సేవలకు ఐఎస్‌వో గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

డీసీసీబీ సేవలకు ఐఎస్‌వో గుర్తింపు

Jun 5 2025 8:14 AM | Updated on Jun 5 2025 8:14 AM

డీసీస

డీసీసీబీ సేవలకు ఐఎస్‌వో గుర్తింపు

నిజామాబాద్‌ సిటీ: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కస్టమర్లకు అందిస్తున్న సేవలకు గాను ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రం అందజేసినట్లు చైర్మన్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మా ట్లాడుతూ.. డీసీసీబీ అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నందుకు, బ్యాంకు నిర్వహ ణ, ఖాతాదారులకు బ్యాంకు ద్వారా అంది స్తున్న విలువైన సేవలకుగాను ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రం (9001 : 2015) జారీ చేసిందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన ఆడిట్‌లో బ్యాంకు మంచి ఆర్థి క ఫలితాలు సాధించి, అన్ని విభాగాల్లో మె రుగైనట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్‌ స్కోర్‌ 90 సా ధించామని, బ్యాంకు చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. డైరెక్టర్లు, సీఈవో నాగభూషణం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

నిజామాబాద్‌ అర్బన్‌: ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల ని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని వి నాయక్‌నగర్‌లో ఉన్న ఈవీఎం గోదాము ను అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమ క్షంలో గోదాము సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూని ట్‌లు, ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. వారి వెంట ఎన్ని కల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, సిబ్బంది సాత్విక్‌, విజయేందర్‌ తదితరులు ఉన్నారు.

కల్తీ విత్తనాలు

విక్రయిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌ రూరల్‌: కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏడీఏం అలీం హైమద్‌ స్పష్టం చేశారు. నగర శివారులోని సారంగాపూర్‌ సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తోపాటు జిల్లా కేంద్రంలోని విత్తన, పురుగు మందుల దుకాణాలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో కలిసి ఏడీఏ బుధవారం పరిశీలించారు. దుకాణాల్లోని స్టాక్‌, బిల్లు రిజిస్టర్లు, విత్తన బస్తాల లాట్‌ నంబర్లను పరిశీలించా రు. లైసెన్‌ ్డ్స డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. రైతులు విత్తన రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలన్నారు. మండల వ్యవసాయ అధికారి జాదవ్‌ హీరా, సీడ్‌ సర్టి ఫికేషన్‌ ఆఫీసర్‌ నాగేశ్‌, ఎస్సై మహేశ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మీనాక్షి నటరాజన్‌తో జిల్లా నేతల సమావేశం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బుధవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలకు పరిశీలకులుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, పీసీసీ డెలిగేట్‌ బాడ్సి శేఖర్‌గౌడ్‌, రాంభూపాల్‌లు మీనాక్షీకి తమ నివేదికలను అందజేశారు. కేటాయించిన జిల్లాల్లో తాము నిర్వహించిన సమావేశాలు, సేకరించిన వివరాలను పూర్తిస్థాయిలో వివరించారు. ఒక్కొక్కరితో క్షుణ్ణంగా మాట్లాడిన మీనాక్షీ అన్ని విషయాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నట్లు నాయకులు పేర్కొన్నారు.

డీసీసీబీ సేవలకు  ఐఎస్‌వో గుర్తింపు 1
1/3

డీసీసీబీ సేవలకు ఐఎస్‌వో గుర్తింపు

డీసీసీబీ సేవలకు  ఐఎస్‌వో గుర్తింపు 2
2/3

డీసీసీబీ సేవలకు ఐఎస్‌వో గుర్తింపు

డీసీసీబీ సేవలకు  ఐఎస్‌వో గుర్తింపు 3
3/3

డీసీసీబీ సేవలకు ఐఎస్‌వో గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement