పరుగు పెడితే పతకమే.. | - | Sakshi
Sakshi News home page

పరుగు పెడితే పతకమే..

Jun 8 2025 1:14 AM | Updated on Jun 8 2025 1:14 AM

పరుగు

పరుగు పెడితే పతకమే..

వేల్పూర్‌: రవాణాశాఖలో హోం గార్డుగా పని చేస్తున్న గుగ్గిలం అశోక్‌ రన్నింగ్‌లో జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. వేల్పూర్‌ మండల కేంద్రానికి చెందిన అశోక్‌ పుట్టిన ఊరితోపాటు రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తున్నాడు. పరుగు పెడితె పతకమే అన్న విధంగా దశాబ్దానికి పైగా జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటూ సుమారు 65 పతకాలు సాధించాడు. రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం అవంతిక కన్‌స్ట్రక్షన్స్‌ నిర్వహించే 3కే, 5కే, 10కే, 21కే రన్నింగ్‌ పోటీలకు అశోక్‌ అంబాసిగర్‌గా గుర్తింపు పొందాడు. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించనున్నారు.

నాలుగు మారథాన్‌లకు అంబాసిడర్‌

జాతీయస్థాయి రన్నింగ్‌లో ప్రతిభ చాటిన అశోక్‌ ఇప్పటివరకు నాలుగు మారథాన్‌లకు అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. మొదట కామారెడ్డిలో మా అసోసియేషన్‌ వారు నిర్వహించిన ఆఫ్‌ మారథాన్‌కు, హైదరాబాద్‌లో నిర్వహించిన హిస్టారికల్‌ రన్‌కు, వరంగ్‌లో నిర్వహించిన మారథాన్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించగా, ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈవెంట్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.

పేదరికం నుంచి పరుగువైపు..

వేల్పూర్‌లో గురువు మురళీధర్‌రెడ్డి వద్ద శిక్షణ పొందిన అశోక్‌ మండల, జోన్‌, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎన్నో పతకాలు సాధించారు. విద్యార్థి దశలోనే సంగారెడ్డిలోని స్పోర్ట్స్‌ హాస్ట ల్‌లో ప్రవేశం లభించినా పేదరికం అడ్డురావడంతో వెళ్లలేకపోయారు. ఇంటర్‌ వరకు చదివిన అశోక్‌ కుటుంబ పోషణకు ఆటో నడుపు తూ పదేళ్లపాటు ఆటలకు దూరంగా ఉన్నారు. 2012లో స్పోర్ట్స్‌ కోటాలో రవాణాశాఖలో హోంగార్డుగా ఉద్యోగం పొందిన అశోక్‌ ప్రస్తు తం కామారెడ్డిలో విధులు నిర్వర్తిస్తున్నారు. క్రీడలపై ఉన్న మక్కువతో తిరిగి తన సాధనను ప్రారంభించాడు. అశోక్‌ను కామారెడ్డిలో ఫిజికల్‌ డైరెక్టర్‌ గోపీరెడ్డి మా అసోసియేషన్‌లో చేర్చి ప్రోత్సహించారు. వేల్పూర్‌ వాసి పన్నాల హరీశ్‌రెడ్డి సూచనతో లాంగ్‌ రన్నింగ్‌పై దృష్టి సారించారు.

ఉమ్మడి రాష్ట్రం తరఫున విశిష్ట పురస్కారం

రన్నింగ్‌ పోటీల్లో జాతీయస్థాయి క్రీడాకారుడిగా పేరుపొందిన అశోక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన రవీంద్రభారతిలో ఉమ్మడి రాష్ట్రాల ఉత్తమ క్రీడాకారుడిగా కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా శాలివాహన విశిష్ట్ట పురస్కారంతో ఏసీపీ డీజీపీ, తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ పూర్ణచందర్‌రావు, ఇతర అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. మెదక్‌ ఎంపీ రఽఘునందన్‌రావు సైం అఽభినందించారు. వేల్పూర్‌ వీడీసీ వారు, మిత్రులు, శ్రేయోభిలాషులు పలుమార్లు అశోక్‌ను సన్మానించారు.

దశాబ్దానికి పైగా జాతీయస్థాయిలో

రాణిస్తున్న వేల్పూర్‌ వాసి అశోక్‌

నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్న పోటీలకు అంబాసిడర్‌గా ఎంపిక

కామారెడ్డి రవాణాశాఖలో

హోంగార్డుగా ఉద్యోగం చేస్తూనే రాణింపు

ఒలింపిక్స్‌లో పతకం సాధించాలి

ఒలింపిక్స్‌లో నిర్వహించే 42 కిలోమీటర్ల ఫుల్‌ మారథాన్‌ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలన్నదే నా కోరిక. ఈ రన్నింగ్‌ ఈవెంట్‌తో ఒలింపిక్‌ పోటీలకు ముగింపు పలుకుతారు. ఇప్పటిదాకా సాధించిన విజయాల స్ఫూర్తితో ఒలింపిక్‌లో పతకం సాధిస్తా. నన్ను ప్రోత్సహిస్తున్న ఆత్మీయులందరికీ రుణపడి ఉంటా. – అశోక్‌

పరుగు పెడితే పతకమే..1
1/1

పరుగు పెడితే పతకమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement