
సైకిల్పై చార్ధామ్ యాత్ర
రుద్రూర్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియో జకవర్గం రాయికోడ్కు చెందిన రామ్ అనే యువకు డు ఇటీవల కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. యాత్రలో భాగంగా శనివారం ఆయన రుద్రూర్ మండల కేంద్రం నుంచి వెళుతుండగా విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని ఆయన కోరారు. ఇందుకుగాను 12 జ్యోతిర్లింగాలు, చార్ధామ్ యాత్ర సైకిల్పై చే యాలని సంకల్పం పెట్టుకున్నానని తెలిపారు. ప్రస్తుతం కేదారినాథ్, బద్రీనాథ్ మిగిలి ఉన్నందున అక్కడికి వెళుతున్నట్టు వివరించారు.