టీచర్ల న్యాయపోరాటం | - | Sakshi
Sakshi News home page

టీచర్ల న్యాయపోరాటం

Jun 5 2025 8:14 AM | Updated on Jun 5 2025 8:14 AM

టీచర్

టీచర్ల న్యాయపోరాటం

నిజామాబాద్‌అర్బన్‌: పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఏళ్లుగా ఉద్యోగ భద్రత కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వాన్ని తమ పరిస్థితపై అభ్యర్థిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఒకే ఒక ఉత్తర్వు కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగం పొగొ ట్టుకున్న డీఎస్సీ–2008 ఉపాధ్యాయుల పరిస్థితి ఇది. ప్రభుత్వం వారిని కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఎస్జీటీలుగా నియమించినా మాడునెలలుగా జీతాలు అందడం లేదు. ఈ నెల 26వ తేదీన వీరి భవితవ్యంపై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.

అనూహ్యంగా ఉద్యోగాలకు దూరం..

2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం ఇతర స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతోపాటు 30 వేల సెకండరీ గ్రేడ్‌ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డీఎస్సీ పరీక్ష పూర్తయిన తరువాత ర్యాంకుల ప్రాతిపదికన రిజర్వేషన్‌ ఆధారంగా ఎస్జీటీ ఉపాధ్యాయుల ఎంపిక జాబితాను పూర్తిచేసి అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసింది. ఉపాధ్యాయ పోస్టింగులు ఇచ్చే చివరి సందర్భంలో కోర్టు తీర్పు వీరికి అశనిపాతంలా మారింది. మంజూరైన పోస్టుల్లో టీటీసీ/డీఈడీ చేసిన అభ్యర్థులకు 30 శాతం కోటా ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో వీరి ఉద్యోగజీవితాలపై చీకట్లు కమ్ముకున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 140 మంది..

ఉమ్మడి జిల్లాలో సుమారు 140 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా ఐక్యంగా హైకోర్టులో డబ్ల్యూపీ నంబర్‌ 18683/2009, డబ్ల్యూపీ నంబర్‌ 17340/2013 కేసులు వేశారు. పట్టువదలకుండా 16 ఏళ్లుగా వీరు న్యాయపోరాటం చేస్తుండగా.. 2025 ఫిబ్రవరిలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఎస్జీటీలుగా నియమించారు. తమను రెగ్యులర్‌ చేయాలనే వారు న్యాయపోరాటం చేస్తుండగా.. ఈనెల 26వ తేదీన హైకోర్టు ద్వారా తీర్పు వెలువడనుంది.

మూడు నెలలుగా అందని వేతనాలు

కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పని చేస్తున్న వారికి మూడు నెలలు గడిచినా రూ.31,040 ఫిక్స్‌డ్‌ వేతనం అందలేదు. కాంట్రాక్ట్‌ ఎస్జీటీ ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది ధర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి , మోర్తాడ్‌, సాలూర రుద్రూర్‌ మండలాల్లో పనిచేస్తున్నారు. ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఎదురుచూపు లు తప్పడం లేదు.

రెగ్యులరైజేషన్‌ కోసం

16 ఏళ్లుగా ఎదురుచూపులు

2008–డీఎస్సీ టీచర్లకు

న్యాయం దక్కేనా..

కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ఇచ్చినా

తప్పని వేతన వెతలు

మూడునెలలుగా జీతాలు లేవు

కాంట్రాక్ట్‌ ప్రాతపదికన ఎస్జీ టీ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న మాకు మూడు నెలలుగా జీతాలు లేవు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రవాణా ఖర్చులు అదనపు ఆర్థికభారంగా మారాయి.

– సురేశ్‌, ధనంబండ పాఠశాల, ధర్పల్లి

ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి

16 ఏళ్ల సుదీర్ఘ పోరాటం త రువాత మమ్మల్ని కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఎస్జీటీ ఉపా ధ్యాయలుగా నియమించా రు. కానీ మా పోస్టులను క్ర మబద్ధీకరించి రెగ్యులర్‌ చే యాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.

– కె గంగాధర్‌, ఎంపీపీఎస్‌ రేకులపల్లి, ధర్పల్లి

టీచర్ల న్యాయపోరాటం1
1/2

టీచర్ల న్యాయపోరాటం

టీచర్ల న్యాయపోరాటం2
2/2

టీచర్ల న్యాయపోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement