పడకేసిన పశు వైద్యం | - | Sakshi
Sakshi News home page

పడకేసిన పశు వైద్యం

Jun 6 2025 6:19 AM | Updated on Jun 6 2025 6:23 AM

నిజామాబాద్‌

అసలు, వడ్డీ చెల్లించాకే రెన్యువల్‌

గోల్డ్‌ లోన్‌ రెన్యువల్‌కు ఇక మీదట ఏడాది కాగానే అసలు, వడ్డీ చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు చెబుతున్నారు.

శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2025

– 10లో u

వెటర్నరీ ఆస్పత్రులు, సబ్‌ సెంటర్లలో మందుల కొరత

డీ వార్మింగ్‌, యాంటీబయాటిక్స్‌ లేక మూగ జీవాలకు అందని వైద్యం

రెండేళ్లుగా సరఫరా చేయని ప్రభుత్వం

డబ్బులు వెచ్చించి బయట

కొనుగోలు చేస్తున్న పాడి రైతులు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : పల్లెల్లో పశువైద్యం పడకేసింది. ప్రభుత్వ పశువైద్య కేంద్రాలకు పలు రకాల మందులు సక్రమంగా సరఫరా కావడం లేదు. ప్రధానంగా డీ వార్మింగ్‌, యాంటీ బయాటిక్స్‌, ఇతర అత్యవసర మందులు లేక మూగ జీవాలకు వైద్యం అందించలేకపోతున్నారు. దీంతో ఉచితంగా దొరికే మందులను పాడి రైతులు డబ్బులు వెచ్చించి బయట కొనుగోలు చేస్తున్నారు. తద్వారా గ్రా మాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైమరీ వెటర్నరీ ఆస్పత్రులు, సబ్‌ సెంటర్లు పేరుకే అన్నట్లుగా మారాయి. 2019 పశు గణన ప్రకారం జిల్లాలో ఆవులు, గేదెలు, ఎడ్లు కలిపి 3.10 లక్షలు ఉన్నాయి. గొర్రెలు, మేకలు కలిపి 8 లక్షల పైచిలు కు ఉన్నాయి. మూగ జీవాలు వ్యాధులకు గురైన సమయంలో పాడి రైతులు ప్రభుత్వ పశువైద్య ఆస్పత్రికి వెళ్తే అవసరమైన మందులు దొరకడం లేదని చెప్తున్నారు. సాధారణ మందులే అందుబాటులో ఉంచుతున్నారని, వచ్చిన మందులు ఏం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. నట్టల నివారణ మందులు, యాంటీ బయాటిక్స్‌ లేక పశువైద్య అధికారులు కూడా బయట కొనుక్కోవాలని చీటీ లు రా సిస్తున్నారు. మందులను బయట కొనాలంటే రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు అవుతున్న ట్లు రైతులు చెప్తున్నారు.

అవసరమయ్యే మందులు కావాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం సరఫరా చేయ డం లేదని పలువురు పశువైద్య సిబ్బంది సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సిబ్బంది లేక మూసి ఉంటున్న ఆస్పత్రులు...

ప్రతి గ్రామానికి పశువైద్య సేవలు అందించాలని ప్రభుత్వం ప్రైమరీ వెటర్నరీ ఆస్పత్రులు, సబ్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సరిపడా పశు వైద్యులు లేక పల్లెల్లో ఉన్న పశు వైద్య దావఖానాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల రోజుల తరబడి తెరవడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం తెరిచి మధ్యాహ్నానికే మూసేస్తున్నా రు. వీఎల్‌వో లు, అటెండ ర్లు లేక ఒకే అ ధికారి పని చే స్తున్న పశువై ద్య కేంద్రాలు జిల్లాలో చాలా ఉన్నాయి.

ఈ విషయమై జిల్లా పశుసంవర్ధక శాఖ అధి కారి జగన్నాథచారిని సంప్రదించగా... ఖాళీలు భర్తీ చేయాలని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామని, పల్లె పశు దావఖానాల్లో మందుల కొరతపై సమీక్షిస్తామని, డీ వార్మింగ్‌ మందులు ప్రభుత్వం నుంచే సరఫరా కావాల్సి ఉందని స్పష్టం చేశారు.

న్యూస్‌రీల్‌

మందులు బయట కొంటున్నాం..

ప్రభుత్వ పశు ఆస్పత్రుల ద్వారా మూగ జీవాలకు ఉచిత వైద్యం, మందులు అందడం లేదు. మండల కేంద్రంలో ఉన్న పశువుల ఆస్పత్రిలో పశువులకు అవసరమ్యే మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. ఆస్పత్రికి పోతే మందులు బయట కొనుక్కోవాలని చీటి రాసిస్తున్నారు. వాటిని డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి పశువులకు అవసరమయ్యే అన్ని మందులు అందుబాటులో ఉంచాలి. – రాహుల్‌ రెడ్డి, పాడి రైతు, డొంకేశ్వర్‌

పడకేసిన పశు వైద్యం1
1/3

పడకేసిన పశు వైద్యం

పడకేసిన పశు వైద్యం2
2/3

పడకేసిన పశు వైద్యం

పడకేసిన పశు వైద్యం3
3/3

పడకేసిన పశు వైద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement