
దాశరథిని ప్రభుత్వం విస్మరిస్తోంది
నిజామాబాద్అర్బన్: దాశరథి కృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించాలని, లేనిపక్షంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తామే నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలును ఆమె శుక్రవారం సందర్శించారు. అనంతరం రామాలయం ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను సోయిలేని ప్రభుత్వం పాలిస్తోందని విమర్శించారు. నిజాం ఆకృత్యాలను ఎండగడుతూ ప్రజలని జాగృతం చేసిన దాశరథి జయంతి వేడుకలను నిర్వహించకపోవడం సరైంది కాదన్నారు. నిజామాబాద్లోని ఖిల్లా జైలులో దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ‘ అని రాసి తెలంగాణ ప్రజలను చైతన్య పరిచారని గుర్తుచేశారు. ఆయన శిక్ష అనుభవించిన జైలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల చేశామన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రూ.40 కోట్లు విడుదల చేశానని గుర్తు చేశారు.
వాగ్దానాలను విస్మరించింది
ప్రభుత్వం వాగ్దానాలను విస్మరించిందని కవిత విమర్శించారు. వానాకాలం వచ్చినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ధాన్యం సేకరణు ప్ర భుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రేషన్ షాపు ల్లో బియ్యం కోసం ప్రజలు గంటల తరబడి ని ల్చుంటున్నా సమస్యకు పరిష్కారం చూపడం లేదన్నారు. సమావేశంలో మాజీ మేయర్ నీతు కిరణ్, జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆయన గొప్పతనాన్ని
రేపటి తరాలకు తెలపాలి
శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి
లేని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహిస్తాం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

దాశరథిని ప్రభుత్వం విస్మరిస్తోంది