గుంభనంగా గులాబీలు | - | Sakshi
Sakshi News home page

గుంభనంగా గులాబీలు

Jun 7 2025 1:18 AM | Updated on Jun 7 2025 1:36 AM

నిజామాబాద్‌

మానసిక ఒత్తిడికి..

మానసిక ఒత్తిడిని యోగాతో దూరం చేసుకోవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అఽధికారిణి రాజశ్రీ అన్నారు.

శనివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2025

– 10లో u

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్సీ, కేసీఆర్‌ కుమార్తె కవిత తన తండ్రికి రాసిన లేఖ విషయమై ఇప్పటికీ గందరగోళం సద్దుమణగలేదు. జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న నా యకురాలిగా ఉన్న కవిత రాసిన లేఖ లీక్‌ వ్యవహారంపై ఏవిధంగా స్పందించాలో తెలియని శ్రేణులు మొదట్లో నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఆ తరువాత కొందరు కార్యకర్తలు నిదానంగా సోషల్‌ మీడియాలో స్పందించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలువురు కవిత అభిమానులు లేఖలోని అంశాలు వాస్తవాలేనంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తూ వచ్చారు. ఒక దశలో సోషల్‌ వార్‌ మాదిరిగా దూకుడుగా కవితకు అనుకూలంగా పోస్టులు పెట్టా రు. అయితే బహిరంగంగా మాత్రం ఎక్కడా వ్యా ఖ్యలు చేయలేదు. కాగా ఇందల్వాయి మాజీ ఎంపీపీ రమేశ్‌నాయక్‌ మాత్రం కవితకు మద్దతు తెలు పుతూ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉంటూ ఉద్యమాల్లో పా ల్గొన్న శ్రేణులు మాత్రం కవిత లేఖ విషయమై ఆమెకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. అయితే పార్టీ లైనప్‌ ఏవిధంగా ఉందో తెలియకపోవడంతో సై లెంట్‌గా ఉంటూ వస్తున్నారు. చివరకు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు సైతం సైలెన్స్‌ పాటిస్తూ వస్తున్నారు. అయితే మాజీ ప్రజాప్రతినిధుల ముఖ్య అనుచురుల్లో కొందరు కవితకు వ్యతిరేకంగా సైతం పోస్టులు పెడుతుండడం గమనార్హం.

కవిత పర్యటన నేపథ్యంలో..

కవిత గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆమె పర్యటన నేపథ్యంలో నిజామాబాద్‌ నగరంతోపాటు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఆమె అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత ఫిబ్రవరిలో కవిత జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరైనప్పటికీ ఫ్లెక్సీలు మాత్రం పెట్టలేదు. ప్రస్తుతం మాత్రం ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేసినప్పటికీ శ్రేణుల హాజరు మాత్రం చాలా తక్కువగా ఉంది. పైగా ఫ్లెక్సీల్లో వేర్పాటువాదం స్పష్టంగా కనిపించింది. అన్ని ఫ్లెక్సీల్లో కేసీఆర్‌ ఫొటో మాత్రమే ఉంచారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, సంతోష్‌రావుతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థఽన్‌, షకీల్‌, గణేశ్‌గుప్తా, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ విఠల్‌రావు ఫొటోలు సైతం ఫ్లెక్సీల్లో పెట్టలేదు. కొన్ని ఫ్లెక్సీల్లో ఓ సీనియర్‌ కార్యకర్త ఫొటో కింద బీఆర్‌ఎస్‌ నాయకుడు అని ప్రింట్‌చేసినప్పటికీ ఆ తరువాత దానిపై పేపర్‌ అతికించడం గమనార్హం. కవిత తన పర్యటనలో భాగంగా వరుసగా గుడులను సందర్శిస్తున్నారు. అదేవిధంగా పలువురు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పలకరింపులు, పరామర్శలు చేస్తున్నారు. అయితే ఆమె పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గమనిస్తున్న కార్యకర్తలు దీనిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదని పేర్కొంటున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో గులాబీ శ్రేణులు గుంభనంగా ఉన్నాయి.

న్యూస్‌రీల్‌

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి నిజామాబాద్‌ జిల్లా అండగా ఉంటూ ఉద్యమంలో మరింత ముందుకెళ్లేలా స్ఫూర్తి రగిలించింది. మోతె మట్టి ముడుపు నుంచి మొట్టమొదటి జిల్లా ప్రజాపరిషత్‌ గెలుపు అందించడం ద్వారా గులాబీ పార్టీ రాష్ట్ర సాధన వరకు వెనుదిరిగి చూసుకోకుండా అండగా నిలబడింది. అయితే, కవిత కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్‌ వ్యవహారం తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. అగ్రనాయకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొందని కొంతమంది.. అలాంటిదేమీ లేదని మరికొంత మంది పేర్కొంటున్నారు.

ఎమ్మెల్సీ కవిత జిల్లా పర్యటన

సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు

కేసీఆర్‌ ఫొటో తప్ప కనిపించని

రాష్ట్ర, జిల్లా నాయకుల ఫొటోలు

భారీగా ఫ్లెక్సీలు..

నామమాత్రంగా కార్యకర్తలు

సోషల్‌ మీడియాలో కొందరి ప్రత్యక్ష.. మరికొందరి పరోక్ష యుద్ధం

గుంభనంగా గులాబీలు1
1/4

గుంభనంగా గులాబీలు

గుంభనంగా గులాబీలు2
2/4

గుంభనంగా గులాబీలు

గుంభనంగా గులాబీలు3
3/4

గుంభనంగా గులాబీలు

గుంభనంగా గులాబీలు4
4/4

గుంభనంగా గులాబీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement