సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూడాలి

Jun 7 2025 1:16 AM | Updated on Jun 7 2025 1:16 AM

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూడాలి

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూడాలి

నిజామాబాద్‌నాగారం: సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవా లని జిల్లా వైద్యాధికారిణి రాజశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం డీ ఎంహెచ్‌వో కార్యాలయంలో సీజనల్‌ వ్యాధుల ని యంత్రణపై డివిజన్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడు తూ ఆరోగ్య ఉపకేంద్ర, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప రిధిలో వివిధ శాఖల సమన్వయంతో సీజనల్‌ వ్యాఽ దుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహించి, అనుమానిత కేసులకు చికిత్స అందించాలన్నారు. నీటి నిల్వలను తొలగించేలా అధికారులకు సమాచారం అందించాలని, నీటి ట్యాంకులను క్లోరినేషన్‌ చేయించాలన్నారు. పీహెచ్‌సీల పరిధిలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పా టు చేయాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో, కీటక జనిత వ్యాధుల నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ మాట్లాడుతూ దోమల నియంత్రణపై దృష్టి పెట్టి దోమలు పుట్టకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. సమావేశంలో ఎపిడమాలజిస్ట్‌ వెంకటేశ్‌, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి సామ్రాట్‌ యాదవ్‌, డీహెచ్‌ఈ ఘన్‌పూర్‌ వెంకటేశ్వర్లు, గోవర్ధన్‌, వెంకట్‌ రవి, పీహెచ్‌సీల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement