
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలాంటిది
మోపాల్: సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పేదలకు వరం లాంటిదని పీసీసీ డెలిగేట్, నిర్మల్ జిల్లా పరిశీలకులు బాడ్సి శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం బాడ్సి, సింగంపల్లి గ్రామాలకు చెందిన 18 మంది బాధిత కుటుంబాలకు సుమారు రూ.6 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. వైద్యం ఖరీదైన నేపథ్యంలో అనారోగ్యాలకు గురైన పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, అందుకే ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికసాయం అందించి ఆదుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచిందని గుర్తుచేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలోబాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్రెడ్డి, నాయకులు మల్లయ్య, రవి, జగదీష్రెడ్డి, కొండూరు దాస్, చాకలి లింగం, గూండ్ల పోశెట్టి, కాల్పోల్ వంశీ, తదితరులు పాల్గొన్నారు.
మెంట్రాజ్పల్లిలో..
డిచ్పల్లి: ఎంతోమంది పేదలకు సీఎం సహాయనిధి వరంగా మారిందని డీసీసీ డెలిగేట్ ధర్మాగౌడ్ అన్నారు. మెంట్రాజ్పల్లిలో పది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సాయన్న, ఆనంద్, నరేందర్రెడ్డి, వినోద్, సుధీర్, అభి, శంకర్, రాకేష్, బాలు, బాబా, తదిదతరులు పాల్గొన్నారు.
కొండాపూర్లో..
సిరికొండ: కొండాపూర్లో పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు ఆదివారం పంపిణీ చేశారు. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బుచ్చన్న, నీరటి శ్రీధర్, ఆకుల జగన్, గౌసోద్దీన్, చంద్రాగౌడ్, ఫారూఖ్, బాలసాయిలు తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలాంటిది

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలాంటిది