
సర్కారు బడిలోనే చదివించండి
బాల్కొండ: సర్కారు బడిలోనే చదివించండి అంటూ బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆదివారం బడిబాట నిర్వహించారు. మెండోరా మండల కేంద్రంలో ప్ర భుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మహిళ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. సర్కార్ బడిలోనే నాణ్యమై విద్యా బోధన జరుగుతుందని తెలిపారు.
కొనసాగుతున్న
స్వచ్ఛ కార్యక్రమం
ఆర్మూర్టౌన్: పట్టణంలోని రామాలయంలో ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలు వారంలో ఏ దో ఒక రోజు ఓ గంట పాటు తమ పరిసరాల ను శుభ్రం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ పరిసరాలల్లో గల పిచ్చిమొక్కల ను, మురికి కాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించారు. సభ్యులు జీడీ రాజ్ కుమా ర్, నిశాంత్, అంజనేయులు, గణే్ష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్ఎంఎంఎస్కు
ఇద్దరు విద్యార్థుల ఎంపిక
రుద్రూర్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్)కు మండల కేంద్రంలోని బాలికల హైస్కూల్కు చెందిన విద్యార్థినులు వై.మానస, బి.అలేఖ్య ఎంపికై నట్టు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. వీరికి ప్రతి ఏడాది రూ.12 వేల చొప్పున నాలుగేళ్లు స్కాలర్షిప్ పొందుతారు. స్కాలర్షిప్నకు ఎంపికై న విద్యార్థినులను రైడ్ కమిటీ సభ్యులు అభినందించారు.
సుదర్శన్రెడ్డికి
మంత్రి పదవి ఇవ్వాలి
సిరికొండ: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కయిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారి నరేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు. పదేళ్లు పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు పాటుపడిన సుదర్శన్రెడ్డికి అధిష్టానం పునరాలోచించి తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరారు.
వజ్రోత్సవాలను
విజయవంతం చేయాలి
రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణే ష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే 75వ ( వజ్రోత్సవ) వార్షికోత్సవంలో గ్రామస్తులు అందరు భాగస్వామ్యులు కావాలని నిర్వాహక కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వేడుకలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు. ఇందుకు వివి ధ కమిటీలు ఏర్పాటు చేశారు. సమావేశంలో గణేష్ మండలి అధ్యక్ష, కార్యదర్శులు చిదుర వీరేశం, గెంటీల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను
ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మెండోరా బీజేపీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి అన్నారు. ఆదివారం బు స్సాపూర్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ని ర్వహించి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేయడంపై మోదీకి కృతజ్ఞతలు తెలుపు తూ తీర్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల ను ప్రజలకు వివరించాలన్నారు. ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజల్లోకి తీ సుకెళ్లాలన్నారు. మండల ప్రభారి గంగా సాయన్న, మాజీ ఎంపీటీసీ నడ్పి సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

సర్కారు బడిలోనే చదివించండి

సర్కారు బడిలోనే చదివించండి

సర్కారు బడిలోనే చదివించండి