గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్‌

Jun 9 2025 7:50 AM | Updated on Jun 9 2025 7:50 AM

గ్రామ

గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్‌

డిచ్‌పల్లి: మిరుగు(మృగశిర కార్తె)ను పురస్కరించుకుని ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్‌ కనిపించింది. ప్రజలు చేపల కొనుగోలు కోసం మత్య్సకారుల వద్ద బారులు తీరారు. మిరుగు రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఉంది. ఈ కార్తె మొదటి రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది.

సిరికొండ : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మృగశిర కార్తె వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రైతులు తమ పంట పొలాల్లో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.

ఇందల్వాయి : మండలంలోని గ్రామాల్లో చెరువుల వద్ద చేపలు కొనేందుకు ప్రజలు గంటల తరబడి వేచి చూశారు. గన్నారం, ఇందల్వాయి, సిర్నాపల్లి, నల్లవెల్లి, అన్సాన్‌పల్లి తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం నుంచే చెరువుల వద్ద జనాల సందడి మొదలైంది.

గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్‌1
1/2

గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్‌

గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్‌2
2/2

గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement