
గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్
డిచ్పల్లి: మిరుగు(మృగశిర కార్తె)ను పురస్కరించుకుని ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్ కనిపించింది. ప్రజలు చేపల కొనుగోలు కోసం మత్య్సకారుల వద్ద బారులు తీరారు. మిరుగు రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఉంది. ఈ కార్తె మొదటి రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది.
సిరికొండ : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మృగశిర కార్తె వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రైతులు తమ పంట పొలాల్లో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.
ఇందల్వాయి : మండలంలోని గ్రామాల్లో చెరువుల వద్ద చేపలు కొనేందుకు ప్రజలు గంటల తరబడి వేచి చూశారు. గన్నారం, ఇందల్వాయి, సిర్నాపల్లి, నల్లవెల్లి, అన్సాన్పల్లి తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం నుంచే చెరువుల వద్ద జనాల సందడి మొదలైంది.

గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్

గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్