
రాణంపల్లి క్యాంపు వద్ద బస్షెల్టర్ పునర్నిర్మించాలి
రుద్రూర్: మండలంలోని రాణంపల్లి క్యాంపు వద్ద బస్షెల్టర్ను పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. రాణంపల్లి క్యాంపు, రాణంపల్లి గ్రామస్తులు కోటగిరి, రుద్రూర్ మండల కేంద్రానికి వెళ్లాలంటే ఇక్కడే బస్సు కోసం వేచి ఉంటారు. రోడ్డు వెడల్పులో భాగంగా రోడ్డు ఎత్తు పెరగడం వల్ల ఇక్కడి బస్షెల్డర్ కుంగి పోయింది. వర్షం కురిసినపుడు షెల్టర్లోకి నీరు చేరి పిచ్చి మొక్కలు పెరిగి ఆధ్వానంగా మారింది. దీంతో ప్రయాణికులు రోడ్డు పక్కన ఎండలో, వానలో నిలబడాల్సి వస్తోంది. ప్రయాణికుల అవస్థలు గుర్తించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.