
సాక్షిపై దాడి..కొమ్మినేని అరెస్టు అక్రమం
సాక్షినెట్వర్క్ : ‘సాక్షి’ కార్యాలయాలపై అకారణంగా టీడీపీ గూండాలు దాడులకు పాల్పడటాన్ని, ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల పరిధిలో మంగళవారం సాక్షి సిబ్బందితో పాటు వివిధ జర్నలిస్టు సంఘాలు, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తప్పిదాలను సాక్షి మీడియా ప్రశ్నిస్తున్నదన్న ఒక్క కారణంతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కక్ష గట్టారని విమర్శించారు. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడేనని వ్యాఖ్యానించారు. టీడీపీ రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో కోరారు. పలు చోట్ల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కొన్నిచోట్ల అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలిచ్చారు.

సాక్షిపై దాడి..కొమ్మినేని అరెస్టు అక్రమం