క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Jun 12 2025 3:37 AM | Updated on Jun 12 2025 3:37 AM

క్రైం

క్రైం కార్నర్‌

కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

బాన్సువాడ రూరల్‌: మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలో ఓ బాలుడు కరెంట్‌ షాక్‌తో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఇబ్రాహీంపేట్‌ గ్రామం గంగపుత్ర కాలనీకి చెందిన దుబాయ్‌ సాయిలుకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు గోవర్ధన్‌(13), భార్య గంగవ్వ ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు జరుగగా, సాయిలు ఉపాధి నిమిత్తం మలేషియా వెళ్లాడు. ఇంటివద్ద భార్య గంగవ్వ, కుమారుడు గోవర్ధన్‌ ఉంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు వారి పెంకుటిళ్లు ముందర వేసిన రేకుల షెడ్డు ఇనుప పైప్‌కు విద్యుత్‌ వైర్లు తగిలి కరెంట్‌ సరఫరా అయ్యింది. దీన్ని గమనించని గోవర్ధన్‌ బుధవారం బయట ఆడుకుంటున్న సమయంలో ఇనుపపైప్‌కు తాకడంతో కరెంట్‌షాక్‌తో విగతజీవిగా మారాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మలేషియాలో ఉన్న తండ్రి సాయిలుకు ఫోన్‌లో సమాచారం అందించగా,కుమారుడి కడచూపుకు వస్తాన ని చెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించలేదు. విద్యార్థి మృతిపట్ల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

మోపాల్‌ మండలంలో..

మోపాల్‌: మండలంలోని న్యాల్‌కల్‌లో ఓ బాలుడు కరెంట్‌షాక్‌తో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రాజు–మమత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన శ్రీ వర్షిత్‌ (9) నగరంలోని ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. బుధవారం వారి ఇంటి వద్ద ఆడుకుంటున్న శ్రీ వర్షిత్‌కు తెగిపడ్డ బోరు మోటారు సర్వీస్‌ వైరు తగిలి విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు.

క్రైం కార్నర్‌1
1/1

క్రైం కార్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement