
సారూ.. బడిలోకి ఎలా వెళ్లాలి?
నవీపేట: వేసవి సెలవుల అనంతరం నేడు బడులు తెరుచుకోనున్నాయి. ఈక్రమంలో సర్కార్ బడుల్లో ప్రవేశాల సంఖ్యను పెంచడానికి, విద్యార్థులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొత్త విద్యార్థులకు హంగుఆర్భాటాలతో స్వాగతం పలికేందుకు పాఠశాలలను ఉపాధ్యాయులు ముస్తాబు చేస్తున్నారు. కానీ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మాత్రం విద్యార్థులు లోనికి రాకుండా మొరం కుప్పలు, వర్షపు నీటితో అధ్వానంగా మారింది. బడిబాటలో భాగంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ఉపాధ్యాయు లు ఇంటింటికీ తిరిగి పాఠశాల గొప్పతనాన్ని వివరించారు. ప్రవేశాల సంఖ్య పెంచడానికి కృషి చేశా రు. కానీ బడుల పున:ప్రారంభం రోజే బడి ఆవర ణ ఇలా వర్షపు నీరు, మొరం కుప్పలతో నిండి ఉండడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల అలసత్వం..
ఇటీవల నవీపేటకు వచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి దృష్టికి బడి సమస్యను తీసుకెళ్లగా స్పందించారు. మొరం భర్తీకి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడంతో అధికారులు ముందుకువచ్చారు. కానీ వారు ఆలస్యంగా పనులు ప్రారంభించడంతో కొద్దిమేర మొరం కుప్పలను వేశారు. కుప్పలను చదును చేసేందుకు వీలున్నా అధికారులు అటువైపు వెళ్లలేదు. దీంతో బడి ఆవరణలో మొరం కుప్పలు అలాగే ఉండిపోయాయి.
అధ్వానంగా మారిన నవీపేట
జెడ్పీ బాలుర పాఠశాల ఆవరణ
మొరం కుప్పలు, వర్షపు నీటితో
బడిలోకి వెళ్లలేని పరిస్థితి