పెంచిన బస్‌ పాస్‌ చార్జీలు వెంటనే తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెంచిన బస్‌ పాస్‌ చార్జీలు వెంటనే తగ్గించాలి

Jun 11 2025 11:47 AM | Updated on Jun 11 2025 11:47 AM

పెంచి

పెంచిన బస్‌ పాస్‌ చార్జీలు వెంటనే తగ్గించాలి

నిజామాబాద్‌అర్బన్‌: పెంచిన బస్‌ పాస్‌ చార్జీలను తగ్గించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ డిమాండ్‌ చేశాడు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీ బస్‌ పాస్‌ చార్జీలు దాదాపు 20 శాతం పెంచిందన్నారు. పెంపు వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న సందర్భంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదన్నారు. ఒకవైపు ఫ్రీ బస్సు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ మరొకవైపు పేద విద్యార్థుల నుంచి వసూలు చేయడం దుర్మార్గమని అన్నారు. సమావేశంలో నగర పీడీఎస్‌యూ నాయకులు మనోజ్‌, నిఖిల్‌, ముక్తశ్రీ, దుర్గాప్రసాద్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

నిషేధిత ప్లాస్టిక్‌ వాడుతున్న టిఫిన్‌ సెంటర్లకు జరిమానా

నిజామాబాద్‌ సిటీ: మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. మంగళవారం నగరంలోని పలు హోటళ్లను తనిఖీ చేశారు. రోడ్లపై విక్రయిస్తున్న తినుబండారాలు, టిఫిన్‌ సెంటర్లను తనిఖీ చేశారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఖిల్లా చౌరస్తా, అర్సపల్లి, మాలపల్లి, బోధన్‌ రోడ్డు, కంఠేశ్వర్‌, కంఠేశ్వర్‌ బైపాస్‌ ఏరియాల్లో ఏఎంసీ జయకుమార్‌ తనిఖీలు చేసి నిషేధిత ప్లాస్టిక్‌ వాడుతున్న టిఫిన్‌ సెంటర్లకు జరిమానా విధించారు. 7 టిఫిన్‌ సెంటర్లకు రూ.17 వేల జరిమానా విధించారు. తక్కువ మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్‌ వాడవద్దని సూచించారు. జరిమానా విధించినా మళ్లీ తిరిగి వాటిని వాడితే ఈ సారి హోటల్స్‌, టిఫిన్‌ సెంటర్లు మూసివేస్తామని హెచ్చరించారు. అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జయకుమార్‌, సానిటరీ సూపర్‌వైజర్‌ సాజిద్‌ అలీ, ఇన్స్‌పెక్టర్లు శ్రీకాంత్‌, సునీల్‌, కృష్ణ, జవాన్లు ఇతర సిబ్బంది ఉన్నారు.

పంట మార్పిడితో సుస్థిర ఆదాయం

జక్రాన్‌పల్లి: వ్యవసాయ సాగులో పంటల మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయం సంపాదించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ మంజు భార్గవి(ప్రాంతీయ వరి పరిశోధన స్థానం రుద్రూర్‌) పేర్కొన్నారు. మంగళవారం పడకల్‌లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. రైతులకు వివిధ అంశాలపైన అవగాహన కల్పించారు. యూరియా, ఇతర ఎరువుల వాడకం, తెగుళ్లు, పురుగు మందుల వాడకం, రసీదు తీసుకోవడం, విత్తన శుద్ధి చేసుకోవడం మొదలగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తన శుద్ధి ప్రాముఖ్యతను వివరించారు. ఏవో దేవిక, వ్యవసాయ విస్తరణ అధికారి సుభాష్య, రైతులు పాల్గొన్నారు.

పెంచిన బస్‌ పాస్‌ చార్జీలు వెంటనే తగ్గించాలి
1
1/2

పెంచిన బస్‌ పాస్‌ చార్జీలు వెంటనే తగ్గించాలి

పెంచిన బస్‌ పాస్‌ చార్జీలు వెంటనే తగ్గించాలి
2
2/2

పెంచిన బస్‌ పాస్‌ చార్జీలు వెంటనే తగ్గించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement