
జీవిత భాగస్వాములను ఎంచుకోవడానికి ఒక చక్కటి వేదిక
నిజామాబాద్నాగారం : పరిచయవేదిక ఎంతో మందికి జీవిత భాగస్వాములను ఎంచుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించిందని అఖిల భారత ప ద్మశాలి సంఘం సెంట్రల్ బోర్డు సభ్యుడు, పద్మ శాలి పరిచయ వేదిక అధ్యక్షుడు దాసరి నర్సింలు అ న్నారు. ఆదివారం నగరంలోని వినాయన్నగర్లో గల విజయలక్ష్మి గార్డెన్లో ఏడో పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ పరిచయ వేదికకు వ ధూవరుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నా రు. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, సిద్ధిపేట, మెదక్ జిల్లా ల నుంచి కూడా అధిక సంఖ్యలో యువతీయువకు లు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మైసల నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ భీమర్తి రవి, కోశాధికారి దిండిగల్ల శంకర్, సంయుక్త కార్యదర్శులు భీమర్తి సురేందర్, గర్ధాస్ శంకర్, ఉపాధ్యక్షులు అంకం జగదీష్, గాలిపల్లి నా రాయణ, గెంట్యాల వెంకటేశ్, రాజేంద్రప్రసాద్, బూస శ్రీనివాస్, నగర పద్మశాలి సంఘం అధ్యక్షు డు పెంట దత్తాద్రి, తదితరులు పాల్గొన్నారు.

జీవిత భాగస్వాములను ఎంచుకోవడానికి ఒక చక్కటి వేదిక