మోక్షమెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

మోక్షమెప్పుడో?

Jun 9 2025 8:10 AM | Updated on Jun 9 2025 8:10 AM

మోక్ష

మోక్షమెప్పుడో?

జలాల్‌పూర్‌–

తిర్మన్‌పల్లి రోడ్డుకు

నిజామాబాద్‌ రూరల్‌ : మండలంలోని తిర్మన్‌పల్లి, జలాల్‌పూర్‌ రోడ్డు పనులతో ఖానాపూర్‌ ఎక్స్‌ రోడ్డు బైపాస్‌ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత రూరల్‌ ఎమ్మెల్యే భూపతి రెడ్డి 2014లో తిర్మన్‌పల్లి– జలాల్‌పూర్‌ రోడ్డు నిర్మాణానికి రూ. 1.22 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత భూపతి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో రోడ్డుకు భూములిచ్చేందుకు రైతులు నిరాకరించడంతో పనులు ఆగిపోయాయి. జలాల్‌పూర్‌– తిర్మన్‌పల్లి రోడ్డు పనులు పూర్తయితే నవీపేట్‌కు వెళ్లాలంటే దాదాపు 15 కిలోమీటర్లు దూరం తగ్గేది. రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పాలవుతున్నారు. తిర్మన్‌పల్లి శివారులో జలాల్‌పూర్‌ గ్రామం అంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఆ మార్గంలో రోడ్డు ఉందనుకొని వెళ్తున్నారు. తీరా కొంత దూరం పోయాక రోడ్డు లేదని గ్రహించి ప్రయాణికులు వెనుదిరుగుతున్నారు. ఇంకా 8 కిలోమీటర్ల రోడ్డు పనులు నిలిచిపోయాయి.

ఇటీవల రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి..తిర్మన్‌పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేయగా ఈ రోడ్డు గురించి రైతులతో మాట్లాడారు. రోడ్డు పనులు త్వరలోనే పూర్తి చేయిస్తానని అన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి స్వగ్రామం రేకులపల్లి.

ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి

తిర్మన్‌పల్లి నుంచి జలాల్‌ పూర్‌ వరకు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. గత ప్ర భుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. కొంతమేర పనులు చేసి వదిలేశా రు. కొందరు రైతులు అభ్యంతరం చెప్పడంతో పను లు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే చొరవ తీసుకుని రోడ్డు పూర్తయ్యేలా చూడాలి. – నాగిరెడ్డి

శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌, తిర్మన్‌పల్లి

దూరభారం తగ్గుతుంది

తిర్మన్‌పల్లి నుంచి జలాల్‌పూర్‌ వెళ్లే రోడ్డు పూర్తయితే రైతులకు దూరభారం తగ్గుతుంది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. తిర్మన్‌పల్లి నుంచి జలాల్‌పూర్‌ వెళ్లాలంటే గుండారం మీదుగా దాదాపు 15 కిలో మీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు వెంటనే ఈ రోడ్డు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. – రాంరెడ్డి, జలాల్‌పూర్‌

నిత్యం రాకపోకలు..

ఖానాపూర్‌ రోడ్డు మీదుగా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. ముందే ఆ ప్రాంతం మొత్తం రైస్‌ మిల్లుల దుమ్మూధూళితో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖానాపూర్‌ రోడ్డు నుంచి బైపాస్‌ రోడ్డు పూర్తి అయితే ప్రయాణికులకు తిప్పలు తప్పుతాయని స్థానికులు అంటున్నారు.

అసంపూర్తి రోడ్డుతో రైతులకు

దూరభారం

గుండారం మీదుగా 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి

ఎమ్మెల్యే చొరవ

తీసుకోవాలంటున్న రైతులు

మోక్షమెప్పుడో?1
1/2

మోక్షమెప్పుడో?

మోక్షమెప్పుడో?2
2/2

మోక్షమెప్పుడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement