క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి

Jun 7 2025 1:16 AM | Updated on Jun 7 2025 1:18 AM

కామారెడ్డి జిల్లాలో

కొడుకుతో కలిసి

చెరువులో దూకిన తల్లి

నిజామాబాద్‌లో

దంపతుల ఆత్మహత్య

కామారెడ్డి క్రైం: క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం కుటుంబంలో విషాదాన్ని నింపింది. కుమారుడితో సహా తల్లి చెరువులో దూకడంతో ఇద్దరి ప్రాణాలు నీట మునిగాయి. నర్సన్నపల్లి గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన రాచమొల్ల ప్రశాంత్‌కు భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన స్రవంతి(25)తో వివాహమైంది. వీరికి శ్రీవల్లి అనే కూతురు, రుద్రేశ్వర్‌(4) అనే కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం స్రవంతి అత్తగారికి చెందిన బంగారాన్ని తల్లి గారి కుటుంబ సభ్యులకు ఇచ్చింది. వారు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. నగలను తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల ఇరు కుటుంబాల మధ్య గొడ వలు జరిగినట్లు తెలిసింది. శుక్రవారం నగల విషయమై స్రవంతితో కుటుంబ సభ్యులు గొడవ పడ్డట్లు సమాచారం. కొద్దిసేపటి తర్వాత స్రవంతి తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. పక్కనే ఉన్న చిన్నమల్లారెడ్డి చెరువు కట్టకు వద్దకు చేరుకున్నారు. నీటిలో దూకడానికి కూతురు నిరాకరించడంతో స్రవంతి కుమారుడు రుద్రేశ్వర్‌తో కలిసి నీటిలో దూకి మరణించింది. దీనిని గమనించిన స్థానికులు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇద్దరి మృతదేహాలను బయటికి తీ యించారు. కుటుంబంలో జరిగిన గొడవల కా రణంగానే స్రవంతి తన కొడుకుతో కలిసి ఆత్మ హత్యకు పాల్పడినట్లు ఆమె తల్లి రాధమణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని రూరల్‌ సీఐ రామన్‌ తెలిపారు.

దంపతుల ఆత్మహత్య

ఖలీల్‌వాడి : నగరంలోని గాయత్రినగర్‌ ప్రాంతంలో దంపతుల ఆత్మహత్య శుక్రవారం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కోటగల్లికి చెందిన శ్రీనివా స్‌ (56), మమత (52)కు ఇద్దరు కుమారు లు, ఒక కూతురు. శ్రీనివాస్‌ నగరంలోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తుండేవాడు. ఇటీవ ల కోటగల్లిలోని సొంతింటిని విక్రయించారు. కూతురికి పెళ్లి చేయడంతోపాటు ఇద్దరు కు మారులను గల్ఫ్‌ దేశానికి పంపించారు. ప్ర స్తుతం గాయత్రినగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేర్వేరు గదుల్లో శ్రీనివాస్‌, మమత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డా రు. సమాచారం అందుకున్న టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ రాజ్‌, ఎస్సై శ్రీకాంత్‌ ఘటనా స్థలానికి చేరుకొని దంపతుల ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. కాగా, ఆర్థిక ఇబ్బందు లతోనే భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికుల ద్వారా తెలిసింది.

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఆత్మహత్య ఘటనలు కలకలం రేపాయి. కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లిలో కుటుంబసభ్యుల మధ్య గొడవ జరగడంతో ఓ తల్లి.. కొడుకుతో కలిసి చెరువులో దూకి మరణించింది. నిజామాబాద్‌ నగరంలోని గాయత్రినగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి 1
1/4

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి 2
2/4

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి 3
3/4

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి 4
4/4

క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement