
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్ అర్బన్: భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పేర్కొన్నారు మంగళవారం కంఠేశ్వర్లోని సీఎస్ఐ పాఠశాలలో నార్త్ మండల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు గల కొన్నేరుగా ఎదుర్కొంటున్న సమస్యలను భూభారతి ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. అనంతరం రైతులు అందించిన దరఖాస్తులను ఇన్చార్జి తహసీల్దార్ విజయకాంత రావు స్వీకరించారు.
క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిద్దాం
నిజామాబాద్ సిటీ: క్యూబాపై అమెరికా ఆంక్షలు విధిస్తూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నదని, ప్రజాస్వామికవాదులు క్యూబాకు సంఘీభావం ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్బాబు కోరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సోషలిస్టు వ్యవస్థను నిర్మిస్తున్న క్యూబా దేశాన్ని కాపాడుకోవాలన్నారు. ఈనెల 4, 5 తేదీలలో విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.