నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి నరసయ్య | - | Sakshi
Sakshi News home page

నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి నరసయ్య

Jun 4 2025 12:43 AM | Updated on Jun 4 2025 12:43 AM

నమ్మిన సిద్ధాంతం కోసం  పోరాడిన వ్యక్తి నరసయ్య

నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి నరసయ్య

నిజామాబాద్‌ సిటీ: నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజా పోరాటాలు చేస్తూ బతికిన వ్యక్తి కామ్రేడ్‌ నాయక్‌వాడి నరసయ్య అని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని అర్సపల్లి స్వగృహంలో నాయక్‌వాడి నర్సయ్య మృతిచెందారు. మృతివర్త తెలిసి వందల సంఖ్యలో కమ్యూనిష్టులు, ప్రజాసంఘాల నాయకులు అర్సపల్లికి తరలివచ్చారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆకుల పాపయ్య మాట్లాడుతూ..నర్సయ్య న్యూడెమోక్రసీ పార్టీ తరపున అర్సపల్లి నుంచి కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా గెలిచారన్నారు. ఆయన తుది శ్వాస విడిచేంతవరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించేవాడని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement