
ఇసుక అందుబాటులో ఉంచాలి
నిజామాబాద్అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాని కి అవసరమైన ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తహసీల్దార్లను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తహసీల్దార్లతో శనివారం సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, లబ్దిదారులను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని అన్నారు. లబ్ధిదారులకు ఇ సుకను రవాణా చేసే వాహనాలకు ప్రత్యేక వే బిల్లులను అందించాలని, ఇసుక పక్క దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వర్షాలు ప్రారంభమైతే ఇసు క లభించే పరిస్థితి ఉండదని, దీనిని దృష్టిలో పెట్టుకుని వానలు కురవకముందే సరిపడా ఇసుక నిల్వలను ఇందిరమ్మ లబ్ధిదారులు ముందస్తుగా సమకూర్చుకునేందుకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక కొరత కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయనే ఫిర్యాదులు రాకూడదన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి సదస్సులు
సమర్థవంతంగా..
ఈనెల 3వ తేదీ నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతు సూచించారు. తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూ భారతి చట్టంలోని నిబంధనలు, దరఖాస్తులను పరిశీలించాల్సిన తీరును వివరించారు. అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, పక్కాగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించాలని, మొక్కుబడిగా కాకుండా ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా, సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వాహనాలకు ప్రత్యేక వే బిల్లులు
ఇసుక పక్కదారి పట్టొద్దు
తహసీల్దార్లకు కలెక్టర్ హనుమంతు
ఆదేశాలు జారీ

ఇసుక అందుబాటులో ఉంచాలి