బోధన్‌ ఆస్పత్రిలో బాధలు పట్టేదెవరికి? | - | Sakshi
Sakshi News home page

బోధన్‌ ఆస్పత్రిలో బాధలు పట్టేదెవరికి?

Jun 1 2025 1:34 AM | Updated on Jun 1 2025 1:34 AM

బోధన్‌ ఆస్పత్రిలో బాధలు పట్టేదెవరికి?

బోధన్‌ ఆస్పత్రిలో బాధలు పట్టేదెవరికి?

వైద్యులు పోస్టులు అందుబాటులో

ఉన్నది

సివిల్‌ సర్జన్‌లు 13 01

సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో 02 01

డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ 09 00

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 27 05 రెగ్యులర్‌

(తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారు 11 మంది)

సివిల్‌ సీనియర్‌ సర్జన్‌ 01 00

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో చెప్పుకునేందుకే 100 పడకలు ఉండగా వైద్యులు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మాత్రమే ఉన్నారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికిత్స కోసం ప్రతిరోజూ పట్టణ ప్రజలతోపాటు బోధన్‌, సాలూర, రుద్రూర్‌, పొతంగల్‌, కోటగిరి, వర్ని, ఎడపల్లి, రెంజల్‌ మండలాలకు చెందిన వారు, పక్కరాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన వారు సైతం వస్తుంటారు. ప్రతి రోజూ 700 ఓపీ ఉంటుండగా, 30 నుంచి 40 మంది రోగులు ఇన్‌ పేషెంట్లుగా ఉంటున్నారు. ఎమర్జెన్సీ కేసులు తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌కు వెళ్లాల్సిందే.

రెగ్యులర్‌ వైద్యులు ఆరుగురే..

ఆస్పత్రిలో మొత్తం 50 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 18 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో రెగ్యులర్‌ వైద్యులు ఆరుగురు కాగా, తాత్కాలిక ప్రాతిపదికన 11 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.

49 మందే వైద్య సిబ్బంది

ఆస్పత్రిలో మొత్తం 74 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం 49 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో 37 మంది రెగ్యులర్‌ వారుకాగా, 12మంది తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నారు.

తగ్గుతున్న ప్రసవాల సంఖ్య

పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడంతో గడిచిన నాలుగు నెలలుగా ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మే నెలలో 65 కాన్పులు కాగా, ఇందులో 33 నార్మల్‌, 32 ఆపరేషన్లు ఉన్నాయి. గైనిక్‌లు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ఏప్రిల్‌లో 20 మంది గర్భిణులను, మేలో 12 మందిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ఆస్పత్రిలో ఇద్దరు గైనకాలజిస్టులు ఉండగా వారం రోజుల క్రితం నుంచి ఓ వైద్యురాలు విధులకు రావడం లేదు. ప్రస్తుతం ఆర్మూర్‌ నుంచి ఓ గైనకాలజిస్టును డిప్యుటేషన్‌పై పంపించారు.

జిల్లా ఆస్పత్రిలో వంద పడకలు..

18 మంది వైద్యులు

ఆర్థో కేసులొస్తే నిజామాబాద్‌కు వెళ్లాల్సిందే..

మిగతా వైద్య సేవలన్నీ నామమాత్రమే

ప్రతిపాదనలు పంపించాం

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బది నియామకం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. చికిత్సల కోసం వచ్చే రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తున్నాం.

– రాహుల్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement